Shyam Singha Roy: అందుకే ‘ఈ క్రిస్మస్ మనదే’ అని చెబుతున్నా: నాని
నటుడు నాని ఇంటర్వ్యూ. ‘శ్యామ్ సింగరాయ్’ గురించి ఆయన పంచుకున్న విశేషాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: ‘‘శ్యామ్ సింగరాయ్’ కథపై ఉన్న నమ్మకం, అనుకోకుండా చెప్పిన మాట పాపులర్ అవడంతో ‘ఈ క్రిస్మస్ మనదే’ అంటూ ప్రచారం చేస్తున్నాం’ అని నటుడు నాని అన్నారు. ఈయన హీరోగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమిది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదలకానున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
* ప్రేక్షకులు మిమ్మల్ని బిగ్స్క్రీన్పై చూడక రెండేళ్లయింది. దాని గురించి ఏం చెబుతారు?
నాని: పరిస్థితులను బట్టి నేను నటించిన రెండు చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సివచ్చింది. అంతేకానీ కావాలని ఏం చేయలేదు. సత్వహాగా నేను థియేటర్ అభిమానిని. సినిమా విడుదలైన తొలిరోజు తొలి ఆట కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. రెండేళ్ల తర్వాత ఆ అనుభూతి రుచి చూడబోతున్నా.
* ‘శ్యామ్ సింగరాయ్’ కథ విన్నప్పుడు మీకు ఏం అనిపించింది. పాత్రలో లీనమవడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది?
నాని: కథ వినగానే బాగా నచ్చేసింది. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తెరకెక్కిస్తే ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని అనుకున్నా. అంతా నేను ఊహించనట్టుగానే జరిగింది. ఇందులో ద్విపాత్రాభినయం చేశా. పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.
* పీరియాడికల్ కథలో నటించటం ఎలా అనిపించింది?
నాని: ఇతర కథల కంటే పీరియాడికల్ కథలకు చాలా రిస్క్ తీసుకోవాలి. 24 క్రాఫ్ట్లు ఒకే తాటిపై నిలిస్తేనే ఇలాంటి వాటిని తెరకెక్కించగలం. అలా ఈ చిత్రానికి మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలోని సెట్లు మిమ్మల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి.
* ‘శ్యామ్ సింగరాయ్’ గెటప్ కమల్హాసన్ ‘నాయకుడు’ సినిమాను తలపిస్తుంది. మీరేమంటారు?
నాని: అదేం లేదండి. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదు. నా లోపల ఎక్కడో కమల్హాసన్గారి అభిమాని ఉండటంతో లుక్లో ఆ ఛాయలు కనిపించి ఉండొచ్చు.
* దర్శకుడు రాహుల్ సాంకృత్యన్లో మీరు మెచ్చిన అంశం?
నాని: ‘జెర్సీ’ చిత్ర దర్శకుడు గౌతమ్లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో రాహుల్లోనూ అవే ఉన్నాయి. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు పెద్దగా స్పందించరు. తాము అనుకున్న ఔట్పుట్ వచ్చేంత వరకూ విశ్రమించరు.
* చాలాసార్లు ‘ఈ క్రిస్మస్ మనదే’ అని అన్నారు. అంత నమ్మకం ఏంటి?
నాని: కథ మీద ఉన్న నమ్మకం అది. దాంతోపాటు క్రిస్మస్ సమయంలో వస్తున్నాం కాబట్టి ఓ ప్రెస్మీట్లో అలా అన్నా. ఆ మాట పాపులర్ అయింది. అందుకే ప్రతిసారీ ‘క్రిస్మస్ మనదే’ అని చెబుతున్నా.
* కృతిశెట్టి ఎలా నటించింది?
నాని: తను ఇండస్ట్రీకి కొత్త. అయినా చాలా బాగా నటించింది. తెలియని విషయాల్ని నన్నూ రాహుల్ని అడిగేది. ఎన్నో విభిన్న పాత్రలు పోషించాలనేది ఆమె కోరిక. రెండో సినిమా సమయంలోనే అలాంటి ఆలోచనతో ఉండటమనేది అభినందించాల్సిన విషయం.
* సాయిపల్లవితో కలిసి రెండు చిత్రాలు చేశారు. ఆమె గురించి చెప్తారా?
నాని: తనలో ఎలాంటి మార్పురాలేదు. ‘ఎంసీఏ’ చిత్ర సమయంలో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. మా కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే మళ్లీ అలాంటి పాత్రల్లో కాకుండా సవాలు విసిరే క్యారెక్టర్లు వస్తేనే కలిసి నటించాలనుకున్నాం. ‘శ్యామ్ సింగరాయ్’తో అది సాధ్యమైంది.
* సిరివెన్నెల సీతారామశాస్త్రి పాటలు రాసిన ఆఖరి చిత్రంగా ‘శ్యామ్..’ నిలిచింది కదా!
నాని: అది యాదృచ్ఛికం మాత్రమే కాదు ఇంకా ఏదో ఉందని భావిస్తున్నాం. ఆయనకు నివాళితో ఈ సినిమా ప్రారంభవుతుంది. ఆయన స్థాయికి తగ్గట్టు మా చిత్ర కథ ఉందనే సంతృప్తి ఉంది. ఈ సినిమా కథని ఆయన రెండు పాటల్లో చెప్పేశారు. దాన్ని ఇప్పుడు మీరు గ్రహించలేరు. సినిమా చూశాక అది మీకు అర్థమవుతుంది. పాటల్లో కథని చెప్పగలిగే ఇలాంటి రచయితలు అరుదు.
* మీ తదుపరి చిత్రాల కబుర్లేంటి?
నాని: ‘అంటే సుందరానికీ!’ తుది దశ చిత్రీకరణలో ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మరో చిత్రం ‘దసరా’ త్వరలోనే ప్రారంభంకానుంది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించనున్నారు.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్. -
Sundeep Kishan: అలా చేసుంటే మీ సినిమా బ్లాక్బస్టర్ అయ్యేది: సందీప్ కిషన్తో అభిమాని
తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు హీరో సందీప్ కిషన్.
తాజా వార్తలు (Latest News)
-
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
-
102 స్థానాలు.. 16 కోట్ల మంది ఓటర్లు.. తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధం
-
రుణం కోసం ‘చావు తెలివి’.. మృతదేహాన్ని బ్యాంకుకు తీసుకొచ్చి..!
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?