Pawan Kalyan: సాయిధరమ్‌ తేజ్‌ గురించి పవన్‌, త్రివిక్రమ్‌ ఏమన్నారంటే?

యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ నటనని ప్రశంసించిన పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌.

Published : 03 Oct 2021 19:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన చిత్రం ‘రిపబ్లిక్‌’. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. దేవ కట్టా దర్శకుడు. సాయిధరమ్‌ తేజ్‌ కోరిక మేరకు ఆయన ఆస్పత్రిలో ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని అక్టోబరు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. విడుదలైన అన్ని కేంద్రాలలోనూ ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతోపాటు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సాయిధరమ్‌ తేజ్‌ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సాయిధరమ్‌ తేజ్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ‘త్వరలోనే మీ ముందుకు వస్తా’ అని ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని