Tollywood Drugs Case: నేరం రుజువైతే ఎవరినైనా శిక్షించాల్సిందే!
టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. నేరం రుజువైతే ఎవరినైనా శిక్షించాలని అన్నారు.
హైదరాబాద్: టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిన డ్రగ్స్ కేసుపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. భావి తరాలను నాశనం చేసే మత్తు పదార్థాలని ఉపేక్షించవద్దని కోరారు. డ్రగ్స్ కేసులో దోషులుగా తేలితే ఎంతటి వారినైనా శిక్షించాల్సిందేనన్నారు. ‘మా’ ప్యానెల్లో ఉన్న తనీశ్పై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని, ఒకవేళ అవి రుజువైతే ఎవరినైనా శిక్షించాల్సిందేనని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. మరోవైపు.. ‘మా’ అధ్యక్ష ఎన్నికలకి పోటీ చేస్తున్న ప్రకాశ్ రాజ్ తాజాగా తన ప్యానెల్ వివరాల్ని ప్రకటించారు. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్సింగ్ విచారణకి శుక్రవారం హాజరైంది. దాదాపు 6 గంటల పాటు ఈడీ అధికారులు ఆమెని ప్రశ్నించారు. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను ఈడీ విచారించింది. ఈ నెల 17న తనీశ్ విచారణకి హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్