Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ఈడీ విచారణకు హాజరైన రానా

టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ మరింత వేగవంతం చేసింది. డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు...

Updated : 19 Dec 2022 12:09 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తోపాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. విచారణలో భాగంగా బుధవారం ఉదయం కథానాయకుడు రానా దగ్గుబాటి ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. కెల్విన్‌తో ఉన్న పరిచయాలు, ఎఫ్‌ క్లబ్ గురించి అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు రానాతోపాటు నటి ముమైత్‌ ఖాన్‌ని సైతం అధికారులు విచారించనున్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని