Tollywood Drugs Case: డ్రగ్స్ కేసు.. ఈడీ విచారణకు రవితేజ

టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపుకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే...

Updated : 09 Sep 2021 11:10 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్‌క్లబ్‌ గురించి కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, ఛార్మి, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, రానా, నందులను అధికారులు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని