Samantha: నా కారణంగా బాధపడితే క్షమించండి: సమంత
Samantha: పీరియాడికల్ చిత్రం ‘శాకుంతలం’లో నటించడం సంతోషంగా ఉందని అగ్ర కథానాయిక సమంత చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘జెస్సీ’, ‘ఇందు’, ‘బిందు’, ‘గీత’, ‘శశి’, ‘అంజలి’, ‘సమీర’, ‘రామలక్ష్మి’, ‘మధురవాణి’, ‘శ్రావణి’ తదితర వైవిధ్య పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్ని దోచుకుంది నటి సమంత (Samantha). ఆ వైవిధ్యతని వెండితెరపైనే కాకుండా డిజిటల్ మాధ్యమాల్లోనూ చూపించాలనుకుంది. అలా చేసిన ప్రయత్నం, ప్రయోగమే ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’ (The family man 2) వెబ్ సిరీస్. ఇందులో ‘రాజీ’ పాత్రని పోషించి, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. డీ గ్లామర్గా కనిపించి ‘తను సమంతనేనా?’ అనే ఆశ్చర్యంలో పడేసింది. ఉత్తమ నటిగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (Indian film festival of melbourne) అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా సమంత ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో ముచ్చటించింది. ఆ వివరాలివీ...
* ఉత్తమ నటిగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్- 2021 అవార్డు గెలుచుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు?
సమంత: చాలా చాలా ఆనందంగా ఉంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 2’.. నేను నటించిన తొలి వెబ్ సిరీస్. తొలి ప్రయత్నంలోనే ఉత్తమ నటిగా అవార్డు పొందడం నాలో మరింత ఉత్సాహాన్ని పెంచింది. ఈ సిరీస్ ఇప్పటికే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ అవార్డు ప్రకటనతో మరింత ప్రోత్సాహం అందినట్టే.
* ‘ఫ్యామిలీమ్యాన్ 2’ వెబ్సిరీస్లో రాజీగా అత్యుత్తమంగా నటించారు. కానీ మీ పాత్ర, సిరీస్లపై విమర్శలు వచ్చాయి కదా..!
సమంత: అవును. సిరీస్ విడుదలకి ముందు కొన్ని విమర్శలు ఎదురైనా విడుదలైన కొన్ని రోజుల్లోనే ఆ ట్రోలింగ్ ఆగిపోయింది. అయితే రాజీ పాత్ర పోషించినందుకు ఇప్పటికీ నాపై ఆగ్రహం వ్యక్తం చేసేవారున్నారు. ప్రజల మనోభావాల్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఈ పాత్రలో నటించలేదు. నాకు బాగా నచ్చడంతో నిజాయతీగా రాజీ పాత్రని పోషించా. అయినా ఆ పాత్ర కొందరిని బాధించింది కాబట్టి ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నా.
* సామాజిక మాధ్యమాల ఖాతాల్లో అక్కినేని సమంత పేరుని తొలగించి ఎస్ అని పెట్టారు. అది హాట్ టాపిక్ అయింది. దీనిపై మీ స్పందన?
సమంత: అది హాస్యాస్పదమైన గాసిప్. సాధారణంగా నేను గాసిప్స్కి స్పందించను. ఇప్పుడూ అంతే.
* ‘శాకుంతలం’లో నటించడం ఎలా అనిపించింది?
సమంత: పీరియాడికల్ చిత్రంలో నటించాలని ఎప్పటి నుంచో కోరిక. అది ‘శాకుంతలం’తో నెరవేరింది. ఈ సినిమాకి పని చేయడం గొప్ప అనుభూతిని పంచింది. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్), వి.ఎఫ్.ఎక్స్ (విజువల్ ఎఫెక్ట్స్)లతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని ఆసక్తి ఎదురుచూస్తున్నా.
* ‘కాతువాకుల రెండు కాదల్’ చిత్రం కోసం నయనతార, విజయ్ సేతుపతితో నటించడం ఎలా ఉంది?
సమంత: నేనెప్పుడూ కామెడీ పాత్రని పోషించడాన్ని ఆనందిస్తా. ఈ చిత్రం పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ కావడంతో బాగా ఎంజాయ్ చేస్తూ నటించా. ఇందులో భాగమవడం, ఇద్దరు సూపర్స్టార్లు నయనతార, విజయ్ సేతుపతితో కలిసి పనిచేయడం మంచి థ్రిల్ పంచింది. ఇది తప్పకుండా థియేటర్లలో చూడాల్సిన సినిమా. అందరినీ నవ్విస్తుందనే నమ్మకం నాకు ఉంది.
* ఇటీవల మీరు చూసిన వెబ్ సిరీస్ ఏంటి?
సమంత: ‘మారే ఆఫ్ ఈస్ట్టౌన్’ని చూశాను. చాలా బాగుంది. కేట్ విన్ల్సెట్ నటన విశేషంగా ఆకట్టుకుంది. ఇటీవల నేను ఎంజాయ్ చేసిన గొప్ప వెబ్ సిరీస్ ఇది.
* మీ తదుపరి చిత్రాలు?
సమంత: ఇప్పటి వరకు ప్రకటించిన చిత్రాలే తప్ప కొత్త కథల్ని వినలేదు. కొన్ని రోజులు విరామం తీసుకుని, ఆ తర్వాత స్క్రిప్టుల్ని వినాలనుకుంటున్నా. ( ప్రస్తుతం..గుణ శేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’, విఘ్నేశ్ దర్శకత్వంలో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమాలు చేస్తున్నారామె).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’