Sudheer Babu: ఆ విషయం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాలనిపిస్తుంటుంది..!
‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా గురించి నటుడు సుధీర్ బాబు పంచుకున్న విశేషాలు..
ఇంటర్నెట్ డెస్క్: ‘ఎస్.ఎం.ఎస్’, ‘ప్రేమ కథా చిత్రమ్’, ‘భలే మంచి రోజు’, ‘సమ్మోహనం’ తదితర చిత్రాలతో కథానాయకుడిగా అలరించి, ‘వి’తో విలన్గానూ మెప్పించిన నటుడు సుధీర్ బాబు. వాటన్నింటికీ భిన్నంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆనంది కథానాయిక. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 27న విడుదలవుతుంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న విషయాలివీ..
రిస్క్ చేసి కథ వినించారు..
దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘పలాస’ చూసిన వెంటనే ఆయనకు ఫోన్ చేసి, చాలా బాగుందని చెప్పాను. అలా మాట్లాడుతూ నాకు సరిపోయే కథ ఏదైనా ఉంటే చెప్పండని అడిగాను. కొన్ని నెలల తర్వాత కథని నాకు వినిపించాలనుకున్నారు. అదే సమయంలో కొవిడ్ ఫస్ట్ వేవ్ లాక్డౌన్ మొదలైంది. దాంతో నేను ఆన్లైన్ వేదికగా ఆ స్క్రిప్టుని వివరించమని అడిగా కానీ ఆయన అలా చేయలేదు. కొవిడ్ భయం ఉన్నా రిస్క్ తీసుకుని ప్రత్యక్షంగానే కథని చెప్పారు. బాగా నచ్చడంతో ఓకే చేశాను. కమర్షియల్ హంగులున్న మంచి కథ ఇది. ఈ చిత్రంలో డ్యాన్సులు, పోరాటాల్ని కావాలని రూపొందించలేదు. అవన్నీ కథలో భాగంగానే సాగుతాయి. ఈ సినిమా వాస్తవికతకి అద్దం పడుతుంది.
అది వేరు.. ఇది వేరు
‘పలాస’.. 1978లో జరిగిన కథ. ‘శ్రీదేవి సోడా సెంటర్’ ప్రస్తుతానికి సంబంధించింది. రెండింటికీ చాలా తేడా ఉంది. 1978లో పరిస్థితులు ఎలా ఉండేవో దాన్నే దర్శకుడు ‘పలాస’లో చూపించారు. వాస్తవాల్ని తెరకెక్కించే ప్రయత్నంలో కుల ప్రస్తావన వచ్చింది. ‘శ్రీదేవి’లో ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న వాటిని తెరపైకి తీసుకురావాలనుకున్నారు. అలా సాధారణంగా అందరి మధ్య సాగే సంభాషణలే వినిపించారు. అంతేకానీ ఉద్దేశపూర్వకంగా కులాల గురించి చూపించట్లేదు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. మొదటి నుంచీ థియేటర్లలోనే విడుదల చేయాలనే నిర్ణయంతో వాటిని తిరస్కరించాం.
ఇలా కనిపిస్తా..
నేనిందులో సూరిబాబు అనే ఎలక్ట్రిషియన్ పాత్ర పోషించాను. సూరిబాబుకి వాళ్ల అమ్మ అంటే ఎంతో ప్రేమ. అమ్మలాంటి అమ్మాయి తన జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. పట్టణంలో సొంతంగా ఓ షాపు పెట్టి, జీవితంలో స్థిరపడాలనేది సూరి బాబు లక్ష్యం. దాని కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తను కోరుకున్న లక్షణాలున్న అమ్మాయి శ్రీదేవి పరిచయం అవుతుంది. వాళ్లు ప్రేమలో ఎలా పడ్డారు? తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. ఇప్పటి వరకూ పోషించిన పాత్రలకు ఇది విభిన్నంగా ఉండాలనుకున్నాను. అందుకే సూరిబాబు పాత్రలో ఒదిగిపోయేందుకు ఓ ఎలక్ట్రిషియన్ చేసే పనిని దగ్గరుండి పరిశీలించా. నేను చిన్నప్పటి నుంచీ హాస్టల్లోనే పెరిగాను. దాంతో వివిధ ప్రాంతాల యాసని తెలుసుకోగలిగాను. అలా ఈ సినిమాలో గోదావరి యాస పలకడం తేలికైంది. 90శాతం చిత్రీకరణ అమలాపురంలోనే సాగింది.
హీరో పాత్రలే ఇష్టం..
నటన.. మనసుకి సంబంధించిందని అందరూ అనుకుంటారు. శరీరానికి సంబంధించిదనేది నా అభిప్రాయం. అందుకే నేను ఆయా పాత్రల నుంచి త్వరగా బయటకి వచ్చేస్తుంటా. ఒక్క సినిమాతో వచ్చే ‘స్టార్డమ్’ గురించి నాకు పెద్దగా ఆలోచన లేదు. సుధీర్ ఏ పాత్రైనా చేయగలడు.. అనుకునేలా కొనసాగాలనుంది. ఇప్పటి వరకూ నా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఏ దర్శకుడూ నా దగ్గరికీ రాలేదు. మంచి కథతో, దానికి న్యాయం చేయగలననే నమ్మకంతో వచ్చారు. అందుకే నా కెరీర్లో పరాజయాలు తక్కువగా ఉన్నాయి. కృష్ణ, మహేశ్ బాబు సినిమాల్ని కేస్స్టడీలా తీసుకుంటా. వాళ్లు చేసిందే నేను చేయాలని అనుకోను. కథల ఎంపికలో నా ప్రత్యేకత ఉండాలనుకుంటా. ప్రతినాయకుడి పాత్రలూ పోషించినా నేను నాయక పాత్రనే ఇష్టపడతా. ప్రత్యేకంగా ఈ నటులే నాకు స్ఫూర్తి అని చెప్పలేను. సినిమాలే నన్ను ఇన్స్పైర్ చేశాయి.
అప్పుడే కలిసి నటించాల్సింది కానీ..
కరుణ కుమార్ లిటలేచర్ నేపథ్యం ఉన్న దర్శకుడు. అందుకే బలమైన కథల్ని రాస్తుంటారు. మనుషుల్ని పరిశీలించి, వాళ్ల భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సెట్లో అప్పటికప్పుడు సంభాషణలు రాయగలరు. ఆయనలో నటుడూ ఉన్నాడు. శ్రీదేవి పాత్రకు ఆనంది సరిగ్గా సరిపోయింది. తెలుగమ్మాయి కావడంతో చాలా కంఫర్ట్గా నటించాం. ఆమెతో కలిసి ‘ప్రేమ కథా చిత్రమ్’లోనే నటించాల్సింది. కానీ, అప్పుడు మిస్ అయింది. కళ్లు పెద్దగా ఉండటంతో ఆ సినిమాలోని పాత్రకు బాగా సెట్ అవుతుందని నందితని ఎంపిక చేశాం. ఆనంది.. ప్రతిభగల నటి. శ్రీదేవిగా తప్పకుండా మీ అందరినీ మెప్పిస్తుంది.
తదుపరి ప్రాజెక్టులు..
ప్రస్తుతానికి బాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి. త్వరలోనే ఆ వివరాలు చెప్తా. ఇంతకు ముందే అనుకున్న పుల్లెల గోపీచంద్ బయోపిక్ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు వీలు పడట్లేదు. అందుకే గోపీచంద్ని ప్లేయర్గా, కోచ్గా ఒకే సినిమాలో చూపించనున్నాం. వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈలోగా ఇప్పటికే ఖరారు చేసిన ‘ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, హర్షవర్ధన్ దర్శకత్వంలో మరో సినిమా పూర్తి చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
సూపర్హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి