Sushanth: ‘ఇచ్చట’ విషయంలో నాకు దక్కిన గొప్ప ప్రశంస అదే..!
నటుడు సుశాంత్ ఇంటర్వ్యూ .. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ..
ఇంటర్నెట్ డెస్క్: ‘‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ప్రివ్యూ చూసిన అందరూ కొత్త సుశాంత్ని చూశామన్నారు. అదే నాకు దక్కిన గొప్ప ప్రశంస’’ అని యువ నటుడు సుశాంత్ చెప్పారు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో గతేడాది అలరించిన ఆయన ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రానికి దర్శన్ దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. ఈ శుక్రవారమే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గురువారం విలేకర్లతో సుశాంత్ సంభాషించారు.
కొవిడ్ వల్ల అది సాధ్యపడలేదు..
‘నూటొక్క జిల్లాల అందగాడు’ దర్శకుడు సాగర్, నిర్మాత హరీశ్ ద్వారా దర్శన్ పరిచయం అయ్యారు. ‘చి.ల.సౌ’ సినిమా విడుదలకు ముందు దర్శన్ ‘ఇచ్చట’ కథ వినిపించారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది. నాకు చాలా బాగా నచ్చింది. నేను అప్పటి వరకు ఇలాంటి కథ వినలేదు. వాస్తవికతతో కూడిన ఈ చిత్రం మంచి వినోదం పంచుతుంది. కమర్షియల్ హంగులూ ఉన్నాయి. ‘చి.ల.సౌ’ తర్వాత ఇదే చేద్దాం అనుకున్నా. కానీ, ‘అల వైకుంఠపురములో’ అవకాశం రావడంతో వెంటనే చేయలేకపోయా. ‘అల వైకుంఠపురములో’, ‘ఇచ్చట వాహనములు’.. రెండూ ఒకే ఏడాది విడుదలవుతాయి అనుకున్నా. కానీ, కొవిడ్ వల్ల అది సాధ్యపడలేదు.
అందరూ బాగుందన్నారు..
ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు వేరు, ఇది వేరు. ఇందులో చాలా కష్టపడి నటించా. కథానాయకుడి పాత్రే కాదు ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. సినిమా పూర్తయ్యాక సుమారు 50 మందికి ప్రివ్యూ చూపించాం. అందరి నుంచీ మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడు అని అన్నారు. అది నేను ఎప్పటికీ మరిచిపోలేని ప్రశంస.
అనుకున్నట్టుగానే బిజీ అయింది..
ఈ సినిమా టైటిల్ విశేషంగా ఆకట్టుకుంది. ముందుగా ఈ కథకి ‘నో పార్కింగ్’ అనే పేరు అనుకున్నాం. కానీ, తెలుగు వారందరికీ అర్థం అవ్వాలని ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అని ఖరారు చేశాం. ముందు అనుకున్న ‘నో పార్కింగ్’ను ట్యాగ్లైన్గా పెట్టాం. సుకుమారన్ తన కెమెరాతో ప్రతి ఫ్రేమ్నీ చక్కగా బంధించారు. ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం అత్యద్భుతం. హీరోయిన్ విషయానికొస్తే.. నటి రుహానీ శర్మ చెప్పిన ఓ వర్క్ షాప్ కోసం ముంబయి వెళ్లా. అక్కడే ఈ సినిమా కథానాయిక మీనాక్షి చౌదరిని తొలిసారి చూశా. ఆమె మిస్ ఇండియా అని అప్పుడు నాకు తెలియదు.. నేను నటుడినని ఆమెకు తెలియదు. ఆ వర్క్షాప్లో ఆమె నటనని చూసి ఫిదా అయిపోయా. వెంటనే తెలుగు సినిమాల్లో అవకాశం వస్తే చేస్తారా? అని అడిగా. తర్వాత చర్చలు జరిగాయి. ఆమె ఎంట్రీ ఖరారైంది. మేం అనుకున్నట్టుగానే ఈ సినిమా విడుదలకు ముందే పలు చిత్రాల్లో నాయికగా ఎంపికై, బిజీగా ఉంది.
వాళ్లిద్దరి నుంచి చాలా నేర్చుకున్నా..
గతంలో నేను నటించిన ‘చి.ల.సౌ’ చిత్రాన్ని అల్లు అర్జున్ చూసి, తనకు నచ్చడంతో ఆ చిత్రాన్ని చూడమని దర్శకుడు త్రివిక్రమ్కి చెప్పాడు. అలా త్రివిక్రమ్ నా నటనని ఇష్టపడి ‘అల వైకుంఠపురములో’ సినిమాలో అవకాశం ఇచ్చారు. ‘కథల ఎంపికలో సొంతగా నిర్ణయం తీసుకో. సినిమా విజయం అందుకున్నా పరాజయం పాలైనా ఫర్వాలేదు’ అని మామయ్య నాగార్జున ఓ సందర్భంలో చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఏ అనుమానాలూ లేకుండా నేను ఒప్పుకున్న కథ ‘చి.ల.సౌ’. ఎలాంటి ఒత్తిడీ లేకుండా నటించిన చిత్రమిది. అదే పద్ధతిని ‘అల వైకుంఠపురములో’ అనుసరించా. ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చేశా. ‘అల వైకుంఠపురములో’ చిత్రీకరణ సమయంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా.
మహమ్మారి నేర్పిన పాఠాలు..
కుటుంబం, స్నేహితులు.. మన జీవితంలో ఎంత ముఖ్యమో కొవిడ్ మహమ్మారి వల్ల తెలుసుకున్నా. ఒత్తిడి అధిగమించేందుకు లాక్డౌన్ సమయం నుంచి ధ్యానం చేయడం ప్రారంభించా. పియానో నేర్చుకున్నా. అప్పుడప్పుడు వంటలూ చేశా.
పెళ్లి గురించి ఏం అనుకోలేదు..
అలాంటి అమ్మాయిని చేసుకోవాలని, ఇలాంటి అమ్మాయిని వివాహమాడాలని ఏం అనుకోలేదు. నాకు సరైన జోడీ ఎక్కడో ఓ చోట ఉండే ఉంటుంది. తను కనిపిస్తే చేసుకుంటా. కుటుంబ సభ్యులూ పెళ్లి గురించి నన్ను ఇబ్బంది పెట్టరు.
తదుపరి చిత్రాలు..
చాలా కథలు విన్నాను. వాటిల్లో ఓ కథ బాగా నచ్చింది. ఇప్పుడే దానికి సంబంధించి వివరాలు చెప్పలేను. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)