Cinema News: కాలికి సర్జరీ.. అయినా 20 రోజులు శ్రమించా: తనీశ్
యువ నటుడు తనీశ్ ఇంటర్వ్యూ. ఆయన నటించిన ‘మరో ప్రస్థానం’ ఈ నెల 24న విడుదల కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: పలు చిత్రాల్లో బాలనటుడిగా కనిపించి, విశేషంగా అలరించిన తనీశ్ ‘నచ్చావులే’తో హీరోగా మారాడు. ప్రేమకథలతో మెప్పించాడు. ఇప్పుడు ‘మరో ప్రస్థానం’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రంతో కొత్త అనుభూతి పంచనున్నాడు. దర్శకుడు జానీ తెరకెక్కించిన ఈ సినిమా సెప్టెంబరు 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ‘ఈటీవీ- ఈనాడు’తో తనీశ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. సినిమా గురించి, వ్యక్తిగత విషయాల గురించి తనీశ్ ఏమన్నారంటే...
* మీ గత చిత్రాల కంటే ‘మరో ప్రస్థానం’ ఎలా ప్రత్యేకంగా ఉండబోతుంది?
తనీశ్: నేను నటించే ప్రతి చిత్రమూ నాకు ప్రత్యేకమే. ఈ సినిమా సాంకేతికత పరంగా చాలా విభిన్నంగా ఉంటుంది. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. సాధారణంగా యాక్షన్ థ్రిల్లర్ సినిమాలంటే ఏదో ఒక సమస్య, దాన్ని పరిష్కరించే మార్గాలు గుర్తొస్తాయి. అలాంటి కథని ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా.. సింగిల్ షాట్ ఫార్మాట్లో దర్శకుడు జానీ తెరకెక్కించారు. అతి చిన్న కెమెరాతో సన్నివేశాల్ని షూట్ చేశారు. ఈ విధానంలో నటించడం చాలా కష్టం. కానీ, విజువల్గా మాత్రం కొత్త అనుభూతి కలుగుతుంది. మనం వీడియో గేమ్ ఆడేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఈ సినిమా చూసేటప్పుడు అలాంటి ఫీలింగే ఉంటుంది.
ఈ చిత్రం కోసం ఎలా సన్నద్ధమయ్యారు?
తనీశ్: నా కాలికి శస్త్ర చికిత్స జరగడంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే దర్శకుడు జానీ ఈ కథని చెప్పారు. విన్న వెంటనే నాకు బాగా నచ్చింది. ఎలాగైనా ఈ చిత్రాన్ని త్వరగా ప్రారంభించాలనుకున్నాం. అలా అనుకున్న పది రోజుల్లోనే ఫైట్ రిహార్సల్స్కి వెళ్లా. ఇందులో కథానాయకుడి పాత్ర ఏ ఆయుధం లేకుండా చేత్తోనే పోరాటం చేస్తుంది. దానికి తగ్గట్టు 20 రోజులు రిహార్సల్స్ చేశా. ఆ సమయంలో చాలా కష్టమనిపించింది. కన్నీళ్లు వచ్చేవి. సవాలు విసిరే పాత్రలో నటించి, ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచాలంటే ఇలాంటివి తప్పదు అనుకుంటూ ముందుకు సాగా.
ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?
తనీశ్: ఈ సినిమాలోని ముగ్గురు అమ్మాయిల పాత్రలు మినహా మిగిలినవన్నీ నెగెటివ్ పాత్రలే. అందరం గ్యాంగ్స్టర్లుగా కనిపిస్తాం. నా పాత్ర విషయానికొస్తే రెండు కోణాలుంటాయి. లోలోపల ఏదో చేయాలనే తపన ఉన్నా బయటికి మరోలా ప్రవర్తించే క్యారెక్టర్ నాది. సామాజిక అంశాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి. ప్రస్తుత సమాజంలో నెలకొన్న టెర్రరిజం, అత్యాచార ఘటనలు తదితర అంశాల్ని ప్రస్తావించాం.
ఈ నెల 24 తర్వాత మీ జీవితం ఎలా మారబోతుంది?
తనీశ్: సినిమా విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉన్నా నేనిదే పరిశ్రమలో కొనసాగుతా. సినిమాలు చేస్తూనే ఉంటా. అనుకున్న ఫలితం వస్తే ఆనందిస్తా. మరింత ఉత్సాహంతో తదుపరి చిత్రాలు చేస్తా. అలా అవకపోతే ఇతర సినిమాలకి ఇంకా కష్టపడతా. విజయం అనేది మేం పడిన కష్టానికి ఓ అవార్డులాంటిది. థియేటర్లకి విచ్చేసి ప్రేక్షకులు ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా.
మీ కెరీర్లో ఎదురయ్యే సమస్యల్ని ఎలా ఎదుర్కొంటారు?
తనీశ్: ఎవరికైనా కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ప్రధాన బలం. పరాజయం అనేది ముగింపు కాదని, ఎవరో ఏదో అన్నంత మాత్రాన నిరూత్సాహపడకూడదని మా నాన్న ఎప్పుడూ చెబుతుంటారు. వీటిని ఫేస్ చేసే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మనకొచ్చిన ఆటంకాల్ని అధిగమించినదాన్ని బట్టే మనం చరిత్రలో కలిసిపోతామా? చరిత్రలో మిగిలిపోతామా? అనేది డిసైడ్ అవుతుంది. ఈ మాటని నేను బాగా నమ్ముతా. మనిషికి కష్టాలు రాకపోతే సుఖం విలువ ఎలా తెలుస్తుంది!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!