Romantic: ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయా
‘‘వెండితెరపై కథానాయికగా మెరవాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. ఆ కల ఇన్నేళ్లకు తెలుగు సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంది నటి కేతిక శర్మ. ‘రొమాంటిక్’ చిత్రంతో చిత్ర సీమలోకి అడుగు పెడుతోన్న ఉత్తరాది సోయగం ఆమె.
‘‘వెండితెరపై కథానాయికగా మెరవాలని చిన్నప్పటి నుంచి కలలు కనేదాన్ని. ఆ కల ఇన్నేళ్లకు తెలుగు సినిమా ద్వారా నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంది నటి కేతిక శర్మ. ‘రొమాంటిక్’ చిత్రంతో చిత్ర సీమలోకి అడుగు పెడుతోన్న ఉత్తరాది సోయగం ఆమె. ఆకాష్ పూరి హీరోగా నటించిన ఈ సినిమాని అనిల్ పాదూరి తెరకెక్కించారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందు కొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించింది కేతిక. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
‘‘మాది న్యూదిల్లీ. పుట్టి పెరిగిందంతా అక్కడే. చిన్నప్పటి నుంచి సినిమా, సంగీతం, నృత్యం అంటే చాలా ఇష్టం. నటిగా మారాలని పాఠశాల రోజుల్లోనే నిర్ణయించుకున్నా. మా ఇంట్లో అందరూ డాక్టర్లే. నేను ఈ కొత్త ప్రపంచాన్ని ఎంచుకున్నాను. నాకు ‘రొమాంటిక్’ అవకాశం ఇన్స్టాగ్రాం ద్వారా దొరికింది. ‘ఇన్స్టాలో మిమ్మల్ని చూశాం, ఒకసారి ఆడిషన్కు రండి’ అని పూరి కనెక్ట్స్ నుంచి ఓరోజు కాల్ వచ్చింది. వెంటనే వచ్చి ఆడిషన్ ఇచ్చా. కథానాయికగా ఎంపికయ్యా. అలా ఈ సినిమా మొదలైంది. నా తొలి చిత్రమే ఇంత పెద్ద బ్యానర్లో చేయడం చాలా ఆనందంగా ఉంది’’.
మనసుకు నచ్చినట్లు బతికే అమ్మాయిగా..
‘‘ఈ చిత్రంలో నేను మౌనిక అనే పాత్రలో కనిపిస్తాను. ఈ క్షణాన్ని ఆస్వాదించాలని అనుకునే అమ్మాయి తను. సమాజంలో కట్టుబాట్ల గురించి ఆలోచించకుండా.. మనసుకు నచ్చినట్లుగా బతికేస్తుంటుంది. తనెవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా అతనితో ప్రేమలో ఉంటుంది. అద్భుతమైన సంభాషణలు ఉన్నాయి. క్లైమాక్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రమ్యకృష్ణ, ఆకాష్లతో కలిసి నటించడం చాలా సవాల్గా అనిపించింది. ద్వితీయార్ధంలో నా పాత్ర చాలా ఎమోషనల్గా, ఇంటెన్సిటితో సాగుతుంది. దీన్ని సమర్థంగా చూపించడం కోసం చాలా కష్టపడ్డా’’.
ప్రతి సీన్ ఓ ట్రీట్లా..
‘‘ఈ సినిమాతో ఆకాష్ రూపంలో నాకు మంచి స్నేహితుడు దొరికాడు. రమ్యకృష్ణ మేడమ్ రాకతో మా చిత్రం మారిపోయింది. సెట్లో ఆమె నుంచి చాలా నేర్చుకున్నా. ఇది పక్కా పూరి సినిమాలా ఉంటుంది. ప్రతి సీన్ ఓ ట్రీట్లా ఉంటుంది. ఇందులో నేను ‘నా వల్లే కాదే’ అనే పాట పాడాను. తొలి చిత్రంలోనే నాకు పాట పాడే అవకాశం రావడం మరిచిపోలేని అనుభూతి. ప్రస్తుతం తెలుగు నేర్చుకుంటున్నాను’’.
ఆమె నటన చాలా ఇష్టం..
‘‘కథానాయికగా అన్ని రకాల పాత్రలు చేయాలనుంది. సాయిపల్లవి నటనని చాలా ఇష్టపడతా. తెరపై ఆమె ఎంతో సహజంగా నటిస్తుంది. నాకు అలాంటి పాత్రలు చేయాలనుంది. ప్రస్తుతం నాగశౌర్యతో ‘లక్ష్య’ చేస్తున్నాను. వచ్చే నెలలో విడుదల కానుంది. వైష్ణవ్ తేజ్తో ఓ సినిమా చేస్తున్నాను. చిత్రీకరణ దశలో ఉంది. తొలి సినిమా విడుదల కాకముందే ఇలా వరుస చిత్రాలు చేస్తున్నానంటే.. అది పూరి జగన్నాథ్ సర్ వల్లే’’.
‘‘రొమాంటిక్’ సినిమా కోసం ప్రభాస్ సర్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ఓ మరచిపోలేని జ్ఞాపకం. ఆయన మా టీమ్ను పిలిచారు.. మమ్మల్ని ఇంటర్వ్యూ చేయనున్నారు అంటే అసలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు దక్షిణాది చిత్రాలు అంతగా చూడరు. కానీ, ‘బాహుబలి’ అందరికీ తెలుసు. మన ఇండస్ట్రీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చింది ఆ చిత్రమే. అలాంటి ప్రభాస్ మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయనెంతో మంచి వారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనసున్న వ్యక్తి’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు