Pooja Hegde: మొక్కలు నాటిన పూజా.. అక్షయ్‌కుమార్‌కు ఛాలెంజ్‌

ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో నటి పూజాహెగ్డే భాగమయ్యారు.

Updated : 26 Nov 2021 19:25 IST

హైదరాబాద్‌: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో నటి పూజాహెగ్డే భాగమయ్యారు. నటుడు సుశాంత్‌ విసిరిన సవాలు స్వీకరించిన ఆమె శుక్రవారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో మూడు మొక్కలు నాటారు. భావితరాలకు ఎంతగానో ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న సంతోష్‌ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌, రితీష్‌ దేష్‌ముఖ్‌ను ఈ ఛాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కో ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు. సినీ ప్రముఖులతోపాటు క్రీడా, రాజకీయ రంగాల నుంచీ ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. 


 

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని