Pushpa: నేను వారిని ఏడిపించకుండా ఎలా ఉంటా: రష్మిక
కథానాయిక రష్మిక ఇంటర్వ్యూ. ‘పుష్ప’ సినిమా గురించి ఆమె చెప్పిన విశేషాలు..
ఇంటర్నెట్ డెస్క్: తన చూపు.. బంగారం. తన మాట.. మాణిక్యం. తన నవ్వు నవరత్నం. ఎవ్వరికీ ఎన్నడూ తలవంచని ‘పుష్ప’రాజ్లాంటి నిఖార్సైన కుర్రాడిని తన చుట్టూ తిప్పుకునే అందం తన సొంతం. ఆ అందం, గడుసుతనానికి ప్రతిరూపమే ‘శ్రీవల్లి’ అలియాస్ రష్మిక. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లిగా డీ గ్లామర్ పాత్రలో కనిపించిన రష్మిక అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ పాత్ర పేరే ఇప్పుడు ఆమె ముద్దు పేరుగా మారింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. డిసెంబరు 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా రష్మిక పలు ఆసక్తికర విశేషాల్ని మీడియాతో పంచుకుంది.
అల్లు అర్జున్తో నటించాలనే మీ కల నిజమైంది. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
రష్మిక: నేను నటించిన ‘గీత గోవిందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి అల్లు అర్జున్ వచ్చారు. ఆ సమయంలోనే అతనితో నటించాలనుకున్నా. ‘పుష్ప’ ఆ అవకాశాన్ని అందించింది. అనుకున్నది జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే, ఆయనతో నటించేందుకు తొలినాళ్లలో కాస్త భయపడ్డా. ఈ పాత్రకు న్యాయం చేయగలనా? అని ఆలోచిస్తుండేదాన్ని. నా పరిస్థితిని గమనించి ‘నీలో ప్రతిభ ఉండబట్టే ఇక్కడి వరకూ వచ్చావు. ఈ ప్రాజెక్టుకు ఎంపికయ్యావు’ అని అర్జున్ చెప్పారు. అప్పటి నుంచి నాలో మార్పు కనిపించింది.
డీ గ్లామర్ పాత్రలో నటించడం ఎలా అనిపించింది?
రష్మిక: డీ గ్లామర్ విషయానికొస్తే తొలిసారి ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో మేకప్ లేకుండా కనిపించా. ‘పుష్ప’లోని శ్రీవల్లి పాత్ర డీ గ్లామర్గానే కాదు ‘రా’గా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్లో నటించడం కొత్త అనుభూతినిచ్చింది. సుకుమార్ సర్ ‘పుష్ప’తో కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు. ఇలాంటి కథని మనం ఇప్పటి వరకూ చూడలేదు. భవిష్యత్తులోనూ చూడలేం. ఇది పుష్పరాజ్ (కథానాయకుడి పాత్ర) జీవిత కథ. అతని తల్లి, సోదరుడు చుట్టూ తిరుగుతుంది. మధ్యలో నేను (శ్రీవల్లి పాత్ర) దర్శనమిస్తా. ఆయన అందరికీ పుష్పరాజ్ ఏమోగానీ నా దగ్గర మాత్రం పుష్పే. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీని ట్రైలర్లో చూశారుగా!
శ్రీవల్లి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
రష్మిక: సుకుమార్ సర్ శ్రీవల్లి పాత్ర కోసం ముందుగా చిత్తూరు యాస నేర్చుకోమన్నారు. పాత్ర పరిధి మేరకు నా వంతు ప్రయత్నించా. ఇందుకు ఇద్దరు వ్యక్తులు నాకు సహాయం చేశారు. వారిలో ఒకరు ఈ సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. మరొకరు నా స్నేహితురాలి పాత్ర పోషించారు. లుక్ విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకున్నాం. మూడో లుక్ టెస్ట్ ఓకే అయ్యాక సెట్లో అడుగుపెట్టా.
అల్లు అర్జున్తో కలిసి డ్యాన్స్ చేయాలంటే చాలామంది కష్టమంటుంటారు. మీరేమంటారు?
రష్మిక: అర్జున్ డ్యాన్స్ గురించి అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది. ‘సామి సామి’ అనే పాటలోనే ఇద్దరం కలిసి డ్యాన్స్ చేశాం. అది చేసింది నేనేనా అని ఇప్పటికీ అనిపిస్తుంటుంది. అంత అద్భుతంగా వచ్చిందా గీతం. ఈ పాట క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్, రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, కొరియోగ్రాఫర్ శేఖర్లకే దక్కుతుంది. సెకండ్ పార్ట్లో మా ఇద్దరి మధ్య ఎక్కువ పాటలుంటాయేమో చూడాలి.
ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలున్నాయా?
రష్మిక: ఇందులో యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో ఎమోషన్ అదే స్థాయిలో ఉంటుంది. అయినా రష్మిక ఏడవకపోతే ఏం బాగుంటుంది? (నవ్వులు). ప్రేక్షకుల్ని ఏడిపించకుండా ఉండటం ఎలా చెప్పండి!
సమంత ప్రత్యేక గీతంపై మీ స్పందన?
రష్మిక: పాట చిత్రీకరణ పూర్తవగానే ‘చాలా అద్భుతంగా చేశావు’ అని సమంతకు ఫోన్లో సందేశం పంపా. సూపర్ స్టార్గా రాణిస్తూ ప్రత్యేక గీతంలో నటించడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటి అవకాశం నాకొస్తే.. చేయాలనుంటుంది. కానీ, చేస్తానో లేదో కచ్చితంగా చెప్పలేను.
బాలీవుడ్లో అడుగుపెట్టారు.. ఆ చిత్ర పరిశ్రమ గురించి ఏమైనా చెప్తారా?
రష్మిక: సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’ అనే చిత్రంలో, అమితాబ్ బచ్చన్తో ‘గుడ్ బై’ అనే సినిమాలో నటిస్తున్నా. ఆయా చిత్ర బృందాలు బాలీవుడ్లోకి నన్ను సాదరంగా ఆహ్వానించాయి. నా నటన బాగుందని ఆ చిత్ర దర్శకులు చెప్పడం నాలో ధైర్యాన్ని నింపింది. హిందీ ప్రేక్షకులూ ‘పుష్ప’కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీరు శ్రమను నమ్ముతారా? అదృష్టాన్ని నమ్ముతారా?
రష్మిక: శ్రమనే నమ్ముతా. ఒకరి అదృష్టం వల్ల ఏ సినిమా హిట్ అవ్వదు. ఒక్కరి శ్రమ వల్లే అది సాధ్యంకాదు. సమష్టి కృషి వల్లే ఏ చిత్రమైనా విజయం సాధిస్తుందని నమ్ముతుంటా.
► Read latest Cinema News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు