Sharwanand: ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’.. మొదలైంది

శర్వానంద్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాలో మహిళల గొప్పతనాన్ని చూపించనున్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల.

Published : 20 Jul 2021 12:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌, రష్మిక ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ సినిమాలో మహిళల గొప్పతనాన్ని చూపించనున్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్‌లో తీసిన ఓ ఫొటోని పంచుకుంది చిత్రబృందం. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శర్వానంద్‌, రష్మిక ఇప్పటి వరకు పోషించని కొత్త పాత్రల్లో కనిపించనున్నారు. వెన్నెల కిశోర్‌, రవిశంకర్‌, సత్య, ప్రదీప్‌ రావత్‌, గోపరాజు, బెనర్జీ, కల్యాణి నటరాజన్‌, రాజశ్రీ నాయర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తోన్న ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, కళ: ఎ.ఎస్‌. ప్రకాశ్‌. సంగీత దర్శకుడు ఖరారు కాలేదు.

అజయ్‌ భూపతి దర్శకత్వంలో శర్వానంద్‌ నటించిన ‘మహా సముద్రం’ ఇటీవల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఆయన నటించిన మరో చిత్రం ‘ఒకే ఒక జీవితం’ విడుదలకు సిద్ధంగా ఉంది. రష్మిక విషయానికొస్తే.. తెలుగులో అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప’లో నటిస్తోంది. ‘మిషన్‌ మజ్ను’, ‘గుడ్‌బై’.. బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని