Republic: ఆ విషయాన్ని నేను పట్టించుకోను: ఐశ్వర్య రాజేశ్
ఐశ్వర్య రాజేశ్ ఇంటర్వ్యూ. ‘రిపబ్లిక్’ సినిమా విశేషాలు పంచుకున్న నటి...
ఇంటర్నెట్ డెస్క్: ‘పాత్ర నిడివిని పట్టించుకోను. దాని ప్రాధాన్యతనే చూస్తా’ అంటోంది ఐశ్వర్య రాజేశ్. ఆమె నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘టక్ జగదీష్’ తదితర చిత్రాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇప్పుడు ‘రిపబ్లిక్’ చిత్రంతో మరోసారి ప్రతిభని చాటుకోబోతుంది. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా దేవ కట్టా రూపొందించిన చిత్రమిది. అక్టోబరు 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఐశ్వర్య రాజేశ్ మీడియాతో ముచ్చటించింది.
ఫోన్లోనే స్క్రిప్టు విన్నా..
దర్శకుడు దేవ కట్టా నాకోరోజు ఫోన్ చేసి, ఈ సినిమాలో నటిస్తారా? అని అడిగారు. కొవిడ్ కారణంగా ఫోన్లోనే ‘రిపబ్లిక్’ స్క్రిప్టు వినిపించారు. నేను ఇందులో ఎన్ఆర్ఐగా నటించాను. అన్ని సినిమాల్లో చూపించిన విధంగా ప్రేమ అనగానే రొమాంటిక్ గీతాలు, డ్యాన్స్లు ఇందులో ఉండవు. కనీసం ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేసే సన్నివేశమూ లేదు. హీరోహీరోయిన్ అని కాకుండా ప్రతి పాత్రకీ మంచి గుర్తింపు ఉంటుంది. జగపతి బాబు, రమ్యకృష్ణ ఇలా ప్రతి ఒక్కరూ తన నటనతో కట్టిపడేస్తారు.
సాయిధరమ్ తేజ్ సింగిల్ టేక్..
‘రిపబ్లిక్’ పక్కా కమర్షియల్ చిత్రం కాదు. వాస్తవ సంఘటల్ని ఆధారంగా తీసుకుని దేవ కట్టా తనదైన మార్క్ చూపించారు. ఓ బలమైన కథని అందరికీ అర్థమయ్యేలా రూపొందించారు. ఆయన విజన్ ఉన్న వక్తి. తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరపైకి వచ్చేందుకు ఎంతో శ్రమిస్తారు. అతి తక్కువ సమయంలో నా పాత్రకి సంబంధించిన చిత్రీకరణ, డబ్బింగ్ పూర్తయింది. సాయిధరమ్ తేజ్ మంచి నటుడు. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కలెక్టరు పాత్రలో ఒదిగిపోయాడు. చిన్నపిల్లాడిలా పెన్ను పేపర్ పట్టుకుని సంభాషణలు ప్రాక్టీస్ చేశాడు. కోర్టు నేపథ్యంలో సాగే సన్నివేశాన్ని సింగిల్ టేక్లో పూర్తి చేశాడు. సుమారు పది నిమిషాలు ఉంటుందా సీన్.
వాళ్లంటే అభిమానం..
కొత్త దర్శకులు మంచి కథల్ని ఆవిష్కరిస్తున్నారు. ‘ఉప్పెన’ చిత్ర దర్శకుడు బుచ్చిబాబుని ఇటీవల కలిశాను. నా నటన బాగుంటుందని, నాతో పనిచేయాలనునుందని చెప్పారు. ఈ సినిమా కమర్షియల్ హంగులతో వచ్చిందని కథానాయిక కృతిశెట్టి స్టార్గా మారలేదు. తన నటన వల్ల పేరు తెచ్చుకుంది. అలా అని కమర్షియల్ చిత్రాల్లో నాయికగా చేయడం తేలికైన విషయం కాదు. నాకు సమంత, అనుష్క, సౌందర్య అంటే అభిమానం.
సువర్ణలా గుర్తుండిపోవాలి..
తెలుగు సినిమా అవకాశాలు వస్తున్నాయి. పాత్ర నిడివి తక్కువైనా సరే నటనకి ప్రాధాన్యం ఉన్న కథల్నే ఎంపిక చేసుకోవాలనుకుంటున్నా. సినిమా ఫలితాన్ని పక్కనపెడితే నేను పోషించిన పాత్ర అందరికీ చేరువవ్వాలి. ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో సువర్ణ పాత్రలా! కిరణ్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. తమిళంలో పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM