Sooryavanshi: ఓటీటీలో విడుదలైన అక్షయ్‌ కుమార్‌ ‘సూర్యవంశీ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. కరోనా కారణంగా ఏడాది వాయిదాపడి దీపావళి కానుకగా నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Updated : 08 Dec 2022 14:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌ కుమార్‌, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన చిత్రం ‘సూర్యవంశీ’. కరోనా కారణంగా ఏడాది వాయిదాపడిన ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలా థియేటర్లలో సందడి చేసిన ఈ యాక్షన్‌ ఫిల్మ్‌ ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరిస్తోంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిసెంబరు 3 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇందులో రణ్‌వీర్‌సింగ్‌, అక్షయ్‌ కుమార్‌ ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిందని తెలిపారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం ఈ సినిమాని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ అతిథి పాత్రలు పోషించారు. అక్షయ్ కుమార్‌ డీసీపీగా నటించారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని