Allu Arjun: కెరీర్లోనే పుష్ప ప్రత్యేకమైంది
ఎప్పుడూ స్టైల్గా కనిపించే అల్లు అర్జున్ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్ మహిమే! సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్లోని మాస్ అవతారాన్ని డిమాండ్ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్ కాదు, నేల మాస్’ అంటున్నారు అల్లు అర్జున్.
ఎప్పుడూ స్టైల్గా కనిపించే అల్లు అర్జున్ ఒక్కసారిగా తన అవతారాన్నే మార్చేశారు. అదంతా ‘పుష్ప’రాజ్ మహిమే! సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’... అల్లు అర్జున్లోని మాస్ అవతారాన్ని డిమాండ్ చేసింది. ‘నా దృష్టిలో ఇది ఊర మాస్ కాదు, నేల మాస్’ అంటున్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘పుష్ప’ అసలు ఎలా మొదలైంది?
నేను, సుకుమార్ మంచి స్నేహితులం. వ్యక్తిగత విషయాలు పంచుకునేంత చనువు మా మధ్య ఉంది. మేం ‘ఆర్య’ తర్వాత ‘ఆర్య2’ చేశాం. ఆ తర్వాతే చాలా విరామం వచ్చింది. మధ్యలో కలిసినప్పుడంతా మనం సినిమా చేద్దాం అనుకునేవాళ్లం. పది నిమిషాలే ఈ స్క్రిప్ట్ చెప్పారు. వెంటనే చేసేద్దాం అని చెప్పా. మాకు మైత్రీ మూవీ మేకర్స్ తోడైంది. అలా మొదలైందీ చిత్రం. సుకుమార్ కథ చెప్పేటప్పుడే ఇది ఒక సినిమాలో చెప్పలేమేమో అనిపించింది. దాదాపు 4 గంటల కథలా అనిపించింది. ఈ సినిమా ప్రయాణంలోనే మేం రెండు భాగాలుగా తీసుకురావాలని నిర్ణయించాం.
ఈ ప్రయాణం ఎలా సాగింది?
23 నెలల ప్రయాణం ఈ సినిమా. లాక్డౌన్లోనూ నా మనసులో ఈ సినిమానే తిరిగింది. మా చిత్రబృందం అంతా వీడియో కాల్స్లో మాట్లాడుకుంటూ పనిచేశాం. నేను చిత్తూరు యాసపై మరింత పట్టు సంపాదించా. కరోనా అంతరాయం కలిగించినా సినిమాని ఎలాగైనా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించాం. ఎందుకంటే మరో భాగం సినిమా ఉంటుంది కదా, రెండూ ఒకే ఏడాదిలో వస్తే బాగోదని మేం పనిచేశాం. అనుకున్నట్టుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
మీకు ఎదురైన సవాళ్లేంటి?
అతి పెద్ద సవాల్ అంటే మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణ చేయడమే. మన పక్కనే అంత మంచి అడవి, అంత మంచి లొకేషన్ ఉందని ఇన్నాళ్లూ తెలుసుకోలేకపోయాం. ఎవరూ వెళ్లని, రహదారులు లేని ప్రాంతాలకి అడవిలో ఒకట్రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్లి చిత్రీకరణ చేశాం. మేం వెళ్లడానికి ప్రత్యేకంగా రోడ్డు వేసినా, వర్షాలు పడటంతో అది కొట్టుకుపోయేది. రోజూ 400 వరకు మా వాహనాలు ఆ రోడ్డుమీదుగా వెళ్లి, చిత్రీకరణ చేసుకుని ఒక దాని తర్వాత మరొకటి తిరిగొచ్చేవి. ఈ ప్రయాణం మాకో సవాల్ అనే కాదు, ఇదొక అందమైన అనుభవం కూడా. చిత్రీకరణ చేసినన్నాళ్లూ అడవిని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేశాం. మనం పాడు చేయకపోతే చాలు, అవి సహజంగానే అందాన్ని సంతరించుకుంటాయి.
పాత్ర కోసం చాలా మారిపోయినట్టున్నారు..?
నాకే బోర్ కొట్టింది. మారాలని అనిపించింది. పుష్పరాజ్ అనేది ఓ కల్పితమైన పాత్ర. కూలీగా, రవాణా చేసే వ్యక్తిగా, స్మగ్లర్గా... ఇలా మూడు కోణాల్లో కనిపిస్తా. ఆ పాత్రకి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మారేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. మేకప్కే రెండు గంటల సమయం పట్టింది. తొలగించడానికి అర గంటపైనే పట్టేది. ఈ స్థాయి మేకోవర్తో నేనే సినిమా చేయలేదు. హాలీవుడ్లో ప్రాస్థెటిక్ మేకప్ ఎలా చేస్తారు? ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఈ సినిమాతో తెలిసొచ్చింది. యాస గురించి చాలా కసరత్తులే చేశా. స్క్రిప్ట్లో ఉన్న సంభాషణల్ని పలకడమే కాదు, సహజంగా ఓ మాటని రాయలసీమ యాసలో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడేంత పట్టు వచ్చేలా నేను కసరత్తులు చేశా. ఒక భుజం పైకి లేపి కనిపిస్తూ నటించాల్సి వచ్చింది. 2005, 2011లో నా భుజానికి గాయమైంది. శస్త్రచికిత్స జరిగింది. మళ్లీ ఈ సినిమా కోసం అదే భుజంపైకి లేపి నటించాల్సి రావడంతో చాలా నొప్పి వచ్చేది. ‘పుష్ప’కి నా కెరీర్లో చాలా ప్రత్యేకత ఉంది. ఈ సినిమాని చూసి ఎవరెలా స్పందిస్తారో తెలుసుకోవాలనే ఆత్రుత నాలో ఉంది. నా కెరీర్లో తొలిసారి ఇలాంటి ఓ అభిప్రాయం కలిగింది.
‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయికి వెళుతున్నారు. ఇది ముందే అనుకున్నదా?
ఇది పాన్ ఇండియా స్థాయి కావాలని చేసిన సినిమా కాదు. పక్కా తెలుగు సినిమాలాగే ప్రొడక్ట్ బాగుంటే చాలని చేశాం. అదే సమయంలో దీన్ని భిన్న భాషల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించాం. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనేది చూడాలి. అంతే కానీ ఇది ‘బాహుబలి’, ‘కేజీఎఫ్’ తరహా సినిమా కావాలనైతే చేయలేదు. నా చిత్రాలు మలయాళంలో బాగా ఆడతాయి. కన్నడలోనూ చూస్తుంటారు. తొలిసారి ఈ సినిమాని కన్నడ, తమిళం, హిందీల్లో అనువదించి తీసుకెళుతున్నాం. కథల ఎంపిక విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించను. వేసే ఆ ఒక్క అడుగు గురించే ఆలోచిస్తాను తప్ప, మరీ ఎక్కువ దూరం ఆలోచించను. నేను, సుకుమార్ ఇది హిట్ కావాలని పనిచేశాం తప్ప, తను ఇదివరకు ఏం చేశాడో, నేను ఇదివరకు ఏం చేశానో అనే వాటి గురించి ఆలోచించలేదు. ఫహాద్ ఫాజిల్, రష్మిక తదితరులతో కలిసి నటించడం మంచి అనుభవం. రష్మిక చాలా అందమైన నటి. సమంత మాపై ఎంతో నమ్మకంతో ప్రత్యేక గీతం చేశారు. దేవిశ్రీప్రసాద్, చంద్రబోస్ కలిసి మరోసారి చాలా మంచి పాటలు ఇచ్చారు. ఛాయాగ్రాహకుడు క్యూబా ప్రత్యేకమైన కన్నుతో విజువల్స్ని చూశారా అనేలా ఉంటాయి సన్నివేశాలు.
తదుపరి ‘పుష్ప2’ కోసమే రంగంలోకి దిగుతారా?
మొదటైతే నాకు ఒక నెల విరామం కావాలండీ (నవ్వుతూ). ఆ తర్వాతే మిగతా విషయాలు ఆలోచిస్తా.
ఏపీలో సినిమా టికెట్ ధరలపై కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది మీకు కలిసొచ్చే విషయం కదా?
ఆ విషయం చాలా ఆనందాన్నిచ్చింది. ఇందులో ప్రభుత్వ సహకారం చాలా ఉంది. పరిశ్రమ ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరుపుతూ వచ్చింది. సమస్యలన్నిటినీ వాళ్ల దృష్టికి తీసుకెళ్లింది. రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమకి ఇది ఊరటనిచ్చే విషయం. ప్రభుత్వం అనుకోనిదే ఇలాంటి నిర్ణయాలు వెలువడేవి కావు.
‘‘ముందస్తు విడుదల వేడుకలో రాజమౌళి సర్ మాటలు నా మనసుని తాకాయి. ఆయనతో సినిమా చేయాలని ఏ హీరోకి ఉండదు? మీతో కలిసి సినిమా చేయాలనుందని నేనూ అడిగా. తప్పకుండా చేద్దాం, నేను చేయాలనుకునే హీరోల్లో నువ్వూ ఒకడివి’ అని చెప్పారు. కచ్చితంగా ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి సినిమా చేస్తామని నమ్ముతున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాపం చిరంజీవి వస్తున్నారనుకొని...
అప్పట్లో సినిమా నటులంటే ప్రేక్షకులకు విపరీతమైన అభిమానం. ఒకరకంగా తమ అభిమాన కథానాయకుడిని దైవంతో సమానంగా చూసేవారు. ఎదుటివారు దూషించినా, కనీసం చెడుగా మాట్లాడినా పెద్ద పెద్ద గొడవలే జరిగేవి. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత