AlluArjun: పునీత్ ఫ్యామిలీని ఇప్పుడు కలవాలనుకోవడం లేదు: బన్నీ
‘పుష్ప’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్, రష్మిక ఇతర చిత్రబృందం బెంగళూరులో నిర్వహించిన స్పెషల్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ప్రెస్మీట్ సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై...
ప్రెస్మీట్ ఆలస్యమవడంపై మీడియా అసంతృప్తి... క్షమాపణలు చెప్పిన బన్నీ
బెంగళూరు: ‘పుష్ప’(Pushpa) చిత్రం కోసం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్, రష్మిక ఇతర చిత్రబృందం బెంగళూరులో నిర్వహించిన స్పెషల్ ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ప్రెస్మీట్ సుమారు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కావడంపై మీడియా అసంతృప్తి వ్యక్తం చేయడంతో బన్నీ క్షమాపణలు చెప్పారు. ఆ ప్రెస్మీట్ విశేషాలివే..!
‘‘పుష్ప’ ప్రమోషన్స్లో భాగంగా బెంగళూరు రావడం ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో పుట్టకపోయినా చిన్నప్పుడు సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా ఇక్కడికే వస్తుండేవాళ్లం. బెంగళూరులో నా సినిమాలు విడుదలవుతాయని కలలో కూడా ఊహించలేదు. రష్మిక నాకు బాగా నచ్చిన అమ్మాయి. మంచి నటి. తెలుగు, హిందీ, ఇలా పలు ఇండస్ట్రీల్లో తన సత్తా చూపిస్తోంది. ఇక, నా స్నేహితుడు పునీత్ రాజ్కుమార్ మరణవార్త నన్ను కలచి వేసింది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ‘పుష్ప’ బిజీ వల్ల నేను బెంగళూరు రాలేకపోయా. ఇప్పుడు బెంగళూరు వచ్చినప్పటికీ పునీత్ కుటుంబాన్ని కలవాలనుకోవడం లేదు. ఎందుకంటే, ‘పుష్ప’ ప్రమోషన్స్కి వచ్చి కలిశాననిపించుకోవడం నాకు నచ్చదు’’ అని బన్నీ తెలిపారు.
ఉదయం 11.15 గంటలకి ప్రెస్మీట్ అన్నారు. 1.15 గంటలకు ప్రారంభించారు. ఎందుకు ఆలస్యమైంది?
బన్నీ: ఆలస్యమైనందుకు క్షమించండి. మేము ప్రైవేటు ఫ్లైట్లో వచ్చాం. పొగమంచు కారణంగా ఫ్లైట్ టేకాఫ్లో ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ఈ ప్రోగ్రామ్ ఆలస్యమైంది. మీడియా మొత్తానికి నా క్షమాపణలు. సారీ చెబితే మనిషి పెరుగుతాడు. ఎక్కడా తగ్గడని నా అభిప్రాయం.
ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ గుర్తుకు వస్తున్నారు?ఈ కథకు ఆయనకు ఏమైనా సంబంధం ఉందా?
బన్నీ: ఈ సినిమా బ్యాక్డ్రాప్ ఎర్రచందనం స్మగ్లింగ్. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ.
ఈ సినిమాకి గానూ మీకు జాతీయ అవార్డు వస్తుందని దేవిశ్రీ ప్రసాద్ అన్నారు. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?
బన్నీ: ఆయన నా స్నేహితుడు. ‘పుష్ప’కి గానూ బన్నీకి నేషనల్ అవార్డు వస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వస్తుందని చెప్పలేదు. డీఎస్పీ కామెంట్ మీద నేను స్పందించకూడదు. ప్రేక్షకులు మాత్రమే స్పందించాలి.
చిత్తూరులో జరిగిన ఓ ఎన్కౌంటర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం. దానిపై మీ కామెంట్?
ధనుంజయ్: ఆ సంఘటనలకు ‘పుష్ప’ చిత్రానికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది మొత్తం ఫిక్షనల్ మాత్రమే.
కర్ణాటకలో ఎంతవరకూ వసూళ్లు రాబడుతుందని భావిస్తున్నారు?
బన్నీ: కథ నచ్చితే ప్రేక్షకులు తప్పకుండా సినిమాని ఆదరిస్తారని నమ్ముతాను. ఎంత వసూళ్లు సాధిస్తుందనేది చెప్పలేను. మా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందా? లేదా? అనేది మాత్రమే నేను చూసుకుంటా.
‘పుష్పరాజ్’ పాత్రలో నటించడంపై మీ అనుభవం ఎలా ఉంది?
బన్నీ: అటవీ ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. ఈ సినిమా షూట్ ఎంతో కష్టతరమైంది. ఇప్పటివరకూ నేను ఇలాంటి సినిమా చేయలేదు. అటవీ ప్రాంతంలో సౌకర్యాలు కూడా సరిగ్గా ఉండేవి కాదు. దానివల్ల 200 మంది టీమ్ సభ్యులకు బస ఏర్పాటు చేయడం కూడా కష్టంగా ఉండేది. ఈ క్రెడిట్ మొత్తం నిర్మాతలకే.
రష్మిక.. మీరు కన్నడలో ఎందుకు డబ్బింగ్ చెప్పించుకున్నారు?
బన్నీ: ఈ సినిమా కన్నడ డబ్బింగ్ తనే చెబుతానంది. కాకపోతే షూట్, తెలుగు డబ్బింగ్ పూర్తయ్యేసరికి సమయం లేకపోవడంతో మేము డబ్బింగ్ ఆర్టిస్ట్తో ఆమె పాత్రకు వాయిస్ ఇప్పించాల్సి వచ్చింది.
రష్మిక: కన్నడలో డబ్బింగ్ చెప్పడానికి ట్రై చేశాను. కాకపోతే సమయం లేకపోవడంతో వేరే వాళ్లతో వాయిస్ ఇప్పించాల్సి వచ్చింది. తప్పకుండా పార్ట్-2కి నేనే డబ్బింగ్ చెప్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. -
Varun Tej: కల్యాణ్ బాబాయ్ ఇలా చెప్పడం అరుదు: వరుణ్ తేజ్
తన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ మార్చి 1న విడుదల కానున్న సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు హీరో వరుణ్ తేజ్.