Green India Challenge: నాగ చైతన్యతో కలిసి మొక్కలు నాటిన ఆమిర్‌ఖాన్‌

‘గ్రీన్‌ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమిర్‌ఖాన్‌, నాగ చైతన్య.

Published : 19 Sep 2021 16:50 IST

హైదరాబాద్‌: ఎంపీ జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటిస్తున్న ప్రముఖుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా టాలీవుడ్‌ నటుడు నాగ చైతన్యతో కలిసి బాలీవుడ్‌ ప్రముఖ నటుడు ఆమీర్‌ఖాన్‌ బేగంపేట విమానాశ్రయంలో మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ, భావి తరాలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సంతోష్‌ కుమార్‌ని ప్రశంసించారు. మొక్కలునాటడాన్ని ఓ కార్యక్రమంలా కాకుండా బాధ్యతగా స్వీకరించారని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్‌కుమార్‌... ఆమిర్‌ఖాన్‌, నాగ చైతన్యతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. హిందీ చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’ కోసం ఆమిర్‌- నాగ చైతన్య కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకుడు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని