Bigg Boss Telugu 5: బిగ్బాస్ నుంచి అనీ మాస్టర్ ఎలిమినేట్.. కారణాలు అవేనా?
నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-5(Bigg Boss) నుంచి అనీ మాస్టర్(Anee master) ఎలిమినేట్ అయ్యారు
హైదరాబాద్: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న తెలుగు రియాల్టీ షో బిగ్బాస్ సీజన్-5(Bigg Boss) నుంచి అనీ మాస్టర్(Anee master) ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో చివరిగా అనీ మాస్టర్, ప్రియాంకలు మిగలగా, అతి తక్కువ ఓట్లు వచ్చిన అనీ మాస్టర్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా, టెలివిజన్ షోలలో న్యాయ నిర్ణేతగా అనీ మాస్టర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. సెప్టెంబరు 5న మొదలైన బిగ్బాస్ షోలో ఐదో కంటెస్టెంట్గా ఆమె హౌస్లోకి అడుగుపెట్టారు.
మొదట్లో నెమ్మదిగా ఆడి..
హౌస్లోకి అడుగు పెట్టిన తొలి నాళ్లలో అనీ మాస్టర్ అందరినీతోనూ కలివిడిగా ఉండేవారు. ఇంటి సభ్యులతో సౌమ్యంగా, పెద్దరికంతో వ్యవహరించిన ఆమె రోజులు గడిచే కొద్దీ ప్రతి దానికీ అసహనం వ్యక్తం చేసేవారు. పురుషులు బలమైన కంటెస్టెంట్లు అని, వాళ్లు ఇంటి నుంచి వెళ్లిపోవాలంటూ ఎక్కువగా వాళ్లనే నామినేట్ చేసేవారు. ఎక్కువగా అభద్రతా భావానికి లోనయ్యేవారు. ఇక టాస్క్ల సమయంలో జయాపజయాలను సమంగా చూసేవారు కాదు. ఓడిపోతే తీవ్ర ఆగ్రహానికి లోనై గెలిచిన ఇంటి సభ్యులపై చిందులు తొక్కేవారు. తన గేమ్కు ఎవరైనా అడ్డుపడితే గట్టిగా అరిచేసేవారు. ‘గ్రూప్’గా ఆడటం వల్లే తాను ఓడిపోయానని, కావాలని ఓడించారని మండిపడేవారు. రవి, శ్రీరామ్, అనీ మాస్టర్లు ఒకరికొకరు సాయం చేసుకున్నా, దాన్ని ‘గ్రూప్ గేమ్’ అంటే మాత్రం ఒప్పుకోనేవారు కాదు. కెప్టెన్సీ టాస్క్లో ఓడిపోయిన ప్రతిసారీ దిగులుపడిపోయేవారు. ‘నేను హౌస్లో ఉన్నంతకాలం ఒక్కసారి కూడా నన్ను కూడా కెప్టెన్ కానివ్వరు’ అంటూ బాధపడేవారు. అయితే, అనూహ్యంగా 10 వారంలో ఆమె ఇంటి కెప్టెన్ అయి, తన కోరిక నెరవేర్చుకున్నారు.
కిచెన్లో కింగ్.. కాజల్తో ఫైటింగ్
టాస్క్ల సమయంలో అరిచినా, గొడవ చేసినా వంట చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎంతో ఓర్పుతో ఇంటి సభ్యులందరికీ వండి పెట్టేవారు. తొలుత సన్నీ, శ్వేతలతో మంచి స్నేహంగా ఉండేవారు. సన్నీ తన కొడుకులాంటి వాడని, శ్వేత కూతురంటూ ఆప్యాయంగా పిలిచేవారు. అయితే, మొదటి నుంచి కాజల్ను శత్రువుగా చూసేవారు. ఆమె ఏ చిన్న పని చేసినా తప్పు పట్టేవారు. రోజులు గడిచే కొద్దీ ప్రతివారం ఆమెను నామినేట్ చేసేవారు. తిరిగి కాజల్ నామినేట్ చేస్తే మాత్రం ఒప్పుకొనేవారు కాదు. గట్టిగట్టిగా అరిచేసేవారు. ఆ కోపంలో అనీ మాస్టర్ చేష్టలకు ఇంటి సభ్యులే కాదు, ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేవారు. ముఖాన నీళ్లు కొట్టుకోవడం, వెక్కిరించడం, హేళనగా మాట్లాడుతూ డ్యాన్స్ చేసేవారు. అదేమంటే ‘నేను అమర్యాదపూర్వకంగా ప్రవర్తించలేదు’ అంటూ తనని తాను సమర్థించుకునేవారు.‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ విషయంలోనూ కాజల్ నిర్ణయాన్ని తప్పు పడుతూ ఇంటిలో వీరంగం సృష్టించారు. ఈ విషయంలో నాగార్జున సైతం అనీ మాస్టర్ను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి చురకలు అంటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?