Anushka: అభిమానులకు అనుష్క సర్‌ప్రైజ్‌.. గుడ్‌న్యూస్‌ చెప్పిన స్వీటీ

అనుష్కశెట్టి.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు చూడడం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది....

Published : 07 Nov 2021 12:24 IST

హైదరాబాద్‌: అనుష్కశెట్టి.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ పేరు చూడడం కోసం అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత ఆమె నటించిన ‘నిశ్శబ్దం’ గతేడాది ఓటీటీ వేదికగా విడుదలై మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఆ తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్‌లను అనుష్క ఎప్పుడు ప్రకటిస్తుందా? అని ఆమె అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులకు అనుష్క చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

తన తదుపరి ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. పి.మహేశ్‌బాబు దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు. ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా సిద్ధం కానుంది. మరోవైపు యూవీ క్రియేషన్స్-అనుష్క కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఆ బ్యానర్‌లో వచ్చిన ‘మిర్చి’, ‘భాగమతి’ అనుష్కకు మంచి హిట్స్‌ అందించాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని