Arjuna Phalguna: సంక్రాంతి ముందే మొదలవుతోంది
‘‘నేను సినిమాల్లోకి ఉత్తి చేతులతో కళను నమ్ముకుని వచ్చాను. నాకీ రోజు కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తి ఉంది. ఆ ఆస్తి నేను పరిచయం చేసిన నా దర్శకులే’’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన
- శ్రీవిష్ణు
‘‘నేను సినిమాల్లోకి ఉత్తి చేతులతో కళను నమ్ముకుని వచ్చాను. నాకీ రోజు కోట్ల కంటే ఎక్కువ విలువైన ఆస్తి ఉంది. ఆ ఆస్తి నేను పరిచయం చేసిన నా దర్శకులే’’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఇప్పుడాయన నటించిన చిత్రం ‘అర్జున ఫల్గుణ’. తేజ మార్ని దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది. అమృత అయ్యర్ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిర్మాత దిల్రాజు మాట్లాడుతూ ‘‘శ్రీవిష్ణుని హీరో అనాలో.. ఆరిస్ట్ అనాలో.. యాక్టర్ అనాలో నాకు తెలియదు. లీడ్ చేస్తున్నప్పుడు హీరోనే అంటాం. ఆర్టిస్ట్గా ప్రతి సినిమాను కొత్తగా ప్రయత్నిస్తుంటాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా మంచి చిత్రాలు చేస్తూ.. కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. తేజ తీసిన ఈ చిత్రం చూశా. బాగుంది. ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘జోహార్’ చూసినప్పుడు తేజ అదరగొట్టాడనిపించింది. ఇప్పుడీ చిత్రం ఇంకా బాగా వచ్చింది. ఈ సినిమా చూశాక పండక్కి ఇంటికి వెళ్తే ఇంకో రెండు రోజులు ఎక్కువ ఉండి వస్తార’’న్నారు దర్శకుడు వివేక్ ఆత్రేయ. దర్శకుడు తిరుమల కిషోర్ మాట్లాడుతూ ‘‘ఇండస్ట్రీలో నా ప్రతి కథలో ఉండేవాడు విష్ణు. తేజ మాటలతోనే తనెలాంటి సినిమా తీశాడో అర్థమైంది. ట్రైలర్ చూశాక నా ఆలోచన నిజమని అనిపించింది’’ అన్నారు. ‘‘ఓవైపు ‘ఆచార్య’లాంటి పెద్ద చిత్రాలు చేస్తూ.. మరోవైపు ‘అర్జున ఫల్గుణ’ లాంటి చిన్న సినిమాలు తీసుకొస్తున్నందుకు మ్యాట్నీ వాళ్లకు థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు వెంకటేష్ మహా. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘‘సినిమా మొత్తం ఓ అందమైన పెయింటింగ్లా ఉంటుంది. జగదీష్ తన షాట్స్తో పిచ్చెక్కించాడు. ప్రియదర్శన్ మరో బుడ్డి తమన్ కానున్నాడు. తేజ మార్ని పెద్ద ఫైర్ బ్రాండ్. షూటింగ్లో షేక్ ఆడించాడు. నేను నిజంగా భయపడ్డా. తేజ సినిమాలోని మిగతా నటులకు ఏ కథ చెప్పాడో కానీ, ప్రతి ఒక్కరూ హీరోలా చేసేశారు. ఒకరిద్దరు తప్ప సినిమా చూసిన వాళ్లంతా కాలర్ ఎగరేసి ఇదిరా మా గోదావరి జిల్లాలు అని చెప్పుకొంటారు. గోదావరి జిల్లాలో కనిపించే మంచి మనుషులు, అమాయకత్వాలు, సంప్రదాయాలు.. ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. ఈసారి సంక్రాంతి పండగ డిసెంబర్ 31 నుంచి జనవరి 15వరకు ఉంటుంది’’ అన్నారు. ‘‘నాలాంటి కొత్త దర్శకులకు శ్రీవిష్ణు ఓ ధైర్యం. ఈ కథ రాస్తున్నప్పుడే ఆయన్ని అనుకున్నా. సినిమా చూశాక ఆ విషయం మీరే చెప్తారు. ఈ చిత్రం చూశాక.. మంచి యాక్షన్, అందమైన ఎమోషన్స్తో సంక్రాంతి ముందే వచ్చిందనుకుంటారు’’ అన్నారు చిత్ర దర్శకుడు తేజ. ఈ కార్యక్రమంలో బెక్కెం వేణుగోపాల్, అన్వేష్రెడ్డి, దర్శకులు సుధీర్ వర్మ, సాగర్ కె.చంద్ర, హసిత్ గోలి, నాయిక అమృత, నటుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
Allari Naresh: అలాంటివాళ్ల టెన్షన్ను.. నవ్విస్తూ చూపించాం: అల్లరి నరేశ్
అల్లరి నరేశ్ (Allari Naresh) నటించిన వినోదాత్మక చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోయిన్. నరేశ్, ఫరియా, జెమీ లివర్ సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకున్నారు.
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు. -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM