MAA Election: బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు

మా భవనం, విరాళాల గురించి ప్రశ్నించిన నందమూరి బాలకృష్ణ

Updated : 15 Jul 2021 15:44 IST

హైదరాబాద్‌:  ‘మా’ ఎన్నికల విషయంలో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే అంశాన్ని పట్టించుకోను అని ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చెప్పారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల గురించి నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  ‘మా’ ఎన్నికలు, శాశ్వత భవనంతోపాటు మరికొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. ‘‘గతంలో ‘మా’ ఫండ్‌ రైజింగ్‌ కార్యక్రమాలు అంటూ... ఫస్ట్‌ క్లాస్‌ టికెట్లు వేసుకొని విమానాల్లో తిరిగారు. ఆ డబ్బులు ఏం చేశారు’’ అని బాలయ్య ప్రశ్నించారు. 

‘మా’కు శాశ్వత భవనాన్ని ఇంతకాలం ఎందుకు నిర్మించలేకపోయారని ప్రశ్నించిన బాలయ్య... తెలంగాణ సర్కారు నుంచి ఒక్క ఎకరం భూమిని కూడా సంపాదించలేకపోయారా అని ఎద్దేవా చేశారు. ‘మా’ శాశ్వత భవనం నిర్మాణానికి మంచు విష్ణు ముందుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించగా... నేనూ అందులో భాగస్వామినవుతా అని బాలయ్య చెప్పారు. అంతేకాదు అందరం కలిస్తే ‘మా’ కోసం మయసభ లాంటి అద్భుతమైన భవనాన్ని నిర్మించుకోవచ్చని బాలయ్య సూచించారు. దీంతోపాటు ఇది గ్లామర్‌ పరిశ్రమ... మన సమస్యల్ని బహిరంగంగా చర్చించకూడదు అని బాలయ్య హితవుపలికారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని