మణిశర్మ స్వరాలకి కీరవాణి గానం

మణిశర్మ, ఎం.ఎం. కీరవాణి.. ఇద్దరూ ఇద్దరే. తమ తమ బాణీలతో శ్రోతల్ని ఉర్రూతలూగిస్తారు. అలాంటి ఈ ఇద్దరూ ఓ పాట కోసం కలిశారు. ‘బలమెవ్వడు’ అంటూ తమ సంగీత బలాన్ని మరోసారి గుర్తు చేశారు.

Published : 31 Jul 2021 01:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మణిశర్మ, ఎం.ఎం. కీరవాణి.. ఇద్దరూ ఇద్దరే. తమ తమ బాణీలతో శ్రోతల్ని ఉర్రూతలూగిస్తారు. అలాంటి ఈ ఇద్దరూ ఓ పాట కోసం కలిశారు. ‘బలమెవ్వడు’ అంటూ అలరించారు. ధ్రువన్‌, నియా త్రిపాఠి, సుహాసిని, నాజర్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘బలమెవ్వడు’ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. టైటిల్‌ ట్రాక్‌ని కీరవాణి ఆలపించారు. తాజాగా ఈ గీతం విడుదలై, విశేషంగా అలరిస్తుంది. భావోద్వేగంతో సాగే పాట ఇది. మణిశర్మ స్వరాలకి కీరవాణి గానం తోడై అద్భుతంగా నిలుస్తుంది ఈ పాట.  సినిమాలోని కొన్ని సన్నివేశాలు, కీరవాణి పాడుతున్న దృశ్యాలతో రూపొందించిన ఈ లిరికల్‌ వీడియో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని సత్య రాచకొండ తెరకెక్కిస్తున్నారు. ఆర్బీ మార్కండేయులు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని