Director sujeeth: వర్షంలో బండి నెట్టుకుంటూ... ఆ కథ ఆలోచించా!
‘రన్ రాజా రన్’... తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్కు ప్రభాస్ ‘సాహో’ అవకాశమిచ్చారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కింది. దీని తర్వాత ఎలాంటి....
ఫ్లాష్బ్యాక్
హైదరాబాద్: ‘రన్ రాజా రన్’... తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న యువ దర్శకుడు సుజీత్. ఈ సినిమా ప్రభావంతోనే సుజీత్కు ప్రభాస్ ‘సాహో’ అవకాశమిచ్చారు. ‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా చిత్రంగా ఇది తెరకెక్కింది. దీని తర్వాత ఎలాంటి ప్రాజెక్టు ప్రకటించని సుజీత్ ఈటీవీ ప్లస్లో ప్రసారమయ్యే ‘నీకు మాత్రమే చెబుతా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెరీర్ తొలి నాళ్లలో తనకు ఎదురైనా ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘అవకాశాల కోసం బాగా తిరుగుతూ... ఓ మంచి ప్రేమ కథ రాసుకున్నా. తొలి చిత్రం ఇదైతే బాగా ఉంటుందని భావించా. ‘రన్ రాజా రన్’ కంటే ముందు నిర్మాతలకు ఇది వినిపించా. ఫస్ట్ హాఫ్ వారికి బాగా నచ్చింది. సెకండాఫ్ కోసం దాదాపు 5 నెలలు రాత్రింబవళ్లు ఆలోచించి మంచి వర్షన్ రాశా. ప్రొడక్షన్ ఆఫీసుకు వెళ్లి... సెకండాఫ్ వినిపించా... వాళ్లు సూపర్ అన్నారు. ఇక ప్రాజెక్టు ఓకే అయ్యిందన్న ఆనందంతో బండిపై బయలుదేరా. మార్గమధ్యలోనే.. ఫోన్ బాగా రింగవుతోంది. బండి పక్కకు ఆపి లిఫ్ట్ చేశా. ‘చూడమ్మా ఈ కథకు బడ్జెట్ ఎక్కువయ్యేట్లు ఉంది.. వేరే కథ ఉంటే చెప్పు’ అన్నారు. ఒక్కసారిగా మైండ్ ఆగిపోయింది. అప్పుడే వర్షం మొదలైంది. అక్కడే రోడ్డు పక్కన కూర్చొని మూడు గంటల పాటు ఏడ్చాను. వెన్నెల కిషోర్కు ఫోన్ చేశాను. అతను కాస్త ధైర్యం ఇచ్చాడు. ‘నువ్వు షార్ట్ ఫిల్మ్ గంటలో రాయగలవు... సినిమా ఒక రోజులో రాయలేవా?’ అని నన్ను ప్రోత్సహించాడు. ఆ ఉత్సాహంలో జోరుగా అక్కడి నుంచి లేచి బయలు దేరదామని బండి స్టార్ట్ చేస్తే కాలేదు. పెట్రోల్ అయిపోయింది. చేతిలో చిల్లగవ్వ లేదు. జోరున వాన. ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు. బండిని అలా నెట్టుకుంటూ జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకూ వచ్చాను. ఆ ప్రయాణంలో ఎన్నో ఆలోచనలు... బాధ, కోపం, కసి అన్నీ రకాల ఫీలింగ్స్ వచ్చాయి. అదే ఆలోచనలతో ఇంటికి వచ్చి తల తుడుచుకున్నా... అంతే ‘రన్ రాజా రన్’ కథ ఫ్లాష్ అయ్యింది. వెంటనే ప్రొడక్షన్ వాళ్లకు ఫోన్ చేసి ‘సంవత్సరం నుంచి ఓ కథ రాస్తున్నా... చెప్పమంటారా?’ అని అడిగా. రేపు వచ్చేయ్ అన్నారు. నాకు కొంచెం ఇంట్లో ఇబ్బంది ఉంది మూడు రోజుల్లో వస్తానని చెప్పి... ‘రన్ రాజా రాన్’ కథ మొత్తం రాసి తీసుకెళ్లా. ఒక్క డైలాగ్ కూడా మార్చకుండా... ఓకే చేశారు. ఒక ఓటమి వచ్చిందని బాధ పడకూడదు... మరో ప్రయత్నం మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది.’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది నేవీ సిబ్బంది మృతి
-
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ