bigg boss telugu5: మొదటివారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే!

bigg boss telugu5: బిగ్‌బాస్‌ హౌస్‌లో మొదటి వారం నామినేషన్‌ ప్రక్రియ ముగిసింది.

Published : 07 Sep 2021 11:17 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. ఇటీవల మొదలైన ‘సీజన్‌5’లో మొత్తం 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి వెళ్లారు. కాగా, మొదటివారం ఎలిమినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. తొలి వారానికి జస్వంత్‌, రవి, మానస్‌, సరయు, కాజల్‌, హమీదాలు నామినేట్‌ అయ్యారు.

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండటానికి అర్హులు కాని ఇద్దరు వ్యక్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టండి’ అని బిగ్‌బాస్‌ సూచించారు. ఈ సందర్భంగా వ్యర్థాలను వేసే కవర్లపై హౌస్‌మేట్స్‌ ఫొటోలు ముద్రించిన బ్యాగులను ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇద్దరు కంటెస్టెంట్‌లను ఎంచుకుని వారి ఫొటో ఉన్న బ్యాగును చెత్త డబ్బాలో వేయాలి. అత్యధిక మంది జస్వంత్‌ను నామినేట్‌ చేశారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? ఎవరు హౌస్‌లో కొనసాగతారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని