BiggBoss Telugu 5: నామినేషన్స్తో హీటెక్కిన హౌస్.. కూల్ చేసేందుకు నయా టాస్క్
bigg boss telugu5: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రస్తుతం ‘సీజన్-5’ నడుస్తోంది. తాజాగా మూడోవారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది.
మూడోవారం నామినేషన్స్లో ఉన్నది వీళ్లే
ఇంటర్నెట్డెస్క్: కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న షో ‘బిగ్బాస్’. ప్రస్తుతం ‘బిగ్బాస్ సీజన్-5’ ప్రసారమవుతోంది. తాజాగా మూడోవారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మంగళవారంతో పూర్తైంది. ఈ సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య వాడీవేడీగా వాదనలు జరిగాయి. హౌస్లో ఉండేందుకు అర్హత లేని, తమకు ఇష్టంలేని పోటీదారుల పేర్లను బోర్డుపై ముద్రించి.. అందుకు తగిన కారణాలు చెప్పి.. ఆ బోర్డును సుత్తితో బద్దలు కొట్టాల్సిందిగా బిగ్బాస్ సూచించారు.
నామినేషన్లో భాగంగా ప్రియ-లహరి-రవిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వీరి వాదనలతో హౌస్ హీటెక్కింది. దాంతో సోమవారంతో ముగిసిపోవాల్సిన నామినేషన్ ప్రక్రియ మంగళవారం కూడా కొనసాగింది. మొదటివారంలో జరిగిన వివాదాన్ని కారణంగా చూపించి నటరాజ్ మాస్టర్ని జస్వంత్ నామినేట్ చేశాడు. దీంతో అసహనానికి గురైన నటరాజ్ మాస్టర్.. ‘ఇన్ని రోజుల తర్వాత ఆ విషయం గుర్తుకు వచ్చిందా? నువ్వింకా చిన్నపిల్లాడిలానే వ్యవహరిస్తున్నావు. పోయి హౌస్లో ఆడుకో. యూ ఆర్ ఏ కిడ్’ అంటూ జస్వంత్ని హేళన చేసి మాట్లాడారు. ప్రియ చేసిన వ్యాఖ్యలపై అసహనానికి గురైన షణ్ముఖ్, కాజల్ కూడా ఆమెను నామినేట్ చేశారు. ‘నీకు సర్జరీ జరిగిందా?’ అంటూ ప్రియ తనని అడగడం బాడీ షెమింగ్లా అనిపించిందని చెబుతూ హమీదా సైతం ఆమెనే నామినేట్ చేసింది. అలా, తీవ్ర వాదోపవాదాలు, ఘాటైన విమర్శలు, సుదీర్ఘ వివరణలతో మూడోవారం బిగ్బాస్ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. శ్రీరామచంద్ర, ప్రియలను అత్యధిక మంది నామినేట్ చేయగా.. లహరి, ప్రియంక, మానస్లు కూడా నామినేషన్స్లో చేరారు.
నామినేషన్స్ ప్రక్రియ ముగిసిన అనంతరం.. ఒకరిని మరొకరు ఎందుకు నామినేట్ చేశారో వివరణ ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. ప్రియ-లహరి-రవిల మధ్య నామినేషన్స్లో ఏ చర్చ అయితే జరిగిందే అదే చర్చ మళ్లీ కొనసాగింది. అయితే, ఈసారి కాస్త తీవ్రత తక్కువ స్థాయిలో జరిగింది. తాను చూసిందే చెప్పానని.. కావాలని కల్పించి ఏదీ చెప్పలేదని.. దానిని తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రియ పదే పదే చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన లహరి, రవి.. ‘ప్రియ.. తాను చేసిన తప్పును ఏ మాత్రం మనస్ఫూర్తిగా అంగీకరించడం లేదు’ అని అనుకున్నారు. మరోవైపు, ప్రియాంక.. తనతో లోబో అసభ్యంగా ప్రవర్తించాడని.. కాజల్, అనీ మాస్టర్లతో చెప్పడం గమానార్హం. వెంటనే స్పందించిన కాజల్.. ‘ఈ వ్యవహారాన్ని అప్పుడే కడిగేయాల్సింది కదా’ అంటూ ప్రియాంకతో చెప్పింది. నటరాజ్ మాస్టర్ జస్వంత్ల మధ్య కూడా వివరణలు ఇచ్చుకునే ప్రయత్నం జరిగింది. అయితే, జస్వంత్ తనని నామినేట్ చేయడాన్ని నటరాజ్ జీర్ణించుకోలేకపోయారు. ‘ఇలాంటి రియాల్టీ షోలు నా జీవితంలో చాలా చూశా’ అంటూ జస్వంత్తో అసహనానికి గురయ్యాడు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రియ ఒంటరిగా కూర్చొని.. ‘నేను చూసిందే చెప్పానమ్మా.. నువ్వు నమ్మితే చాలు.. దయచేసి అర్థం చేసుకో’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. మరుసటి రోజు ఉదయం అందరూ కాఫీలు తాగుతుండగా ప్రియ హౌస్మేట్స్ మధ్యలోకి వచ్చి ‘నిన్న నా వల్ల జరిగిన గొడవకు నన్ను క్షమించండి’ అని కోరింది.
బిగ్బాస్.. కొత్త కెప్టెన్సీ టాస్క్..
తీవ్ర వాదోపదాలతో హీట్టెక్కిన హౌస్ని చల్లబరిచే ప్రయత్నం చేశాడు బిగ్బాస్. ఇందులో భాగంగా హైదరాబాద్ అమ్మాయి- అమెరికా అబ్బాయి పేరుతో కొత్త కెప్టెన్సీ టాస్క్ని ప్రారంభించాడు. ఇందులో హైదరాబాద్ అమ్మాయిగా లహరి.. అమెరికా అబ్బాయిగా శ్రీరామచంద్రను ఖరారు చేశారు. మిగిలిన హౌస్మెట్స్కు వివిధ రకాల పాత్రలు ఇచ్చారు. మరి, ఈ కెప్టెన్సీ టాస్క్లో ఎవరు అలరిస్తారు? కెప్టెన్ పోటీదారులుగా ఎవరెవరు నిలబడతారు? చూడాల్సింది ఉంది..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?