Bigg Boss Telugu 5: శ్రీరామ్‌.. నువ్వెవరు చెప్పడానికి.. గ్రూప్‌గా వచ్చి అటాక్‌ చేయకూడదు!

‘బిగ్‌బాస్‌ తెలుగు 5’ ప్రోమో విడుదలైంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ఇది.

Updated : 04 Oct 2021 18:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నామినేషన్ల ప్రక్రియతో ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో ఉత్కంఠ నెలకొంది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న కార్యక్రమం ఇది. బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటోన్న ఈ షోలో నామినేషన్ల అంశం ఆసక్తిని పెంచుతోంది. నేడు ప్రసారంకానున్న ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘ఈవారం నామినేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది’ అంటూ బిగ్‌బాస్‌ చెప్పే మాటతో ప్రారంభమైన ఈ ప్రోమో ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. నామినేట్‌ చేయాలనుకుంటున్న ఇద్దరి ఇంటిసభ్యుల పేర్లు, అందుకు తగిన కారణాలు చెప్పమని బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌ని ఆదేశిస్తాడు. ‘ఇలా సీక్రెట్‌గా కాకపోయినా బయట జరిగినా ఈ రెండు పేర్లు చెప్పాలని నేను డిసైడ్‌ అయ్యాను’ అని సన్నీ, ‘నన్ను నామినేట్‌ చేసినవారిని నేనూ నామినేట్‌ చేస్తాను’ అని కాజల్‌ తమ మనసులో మాట బయటపెట్టారు. ‘ఒకప్పుడు నేను చూసిన విశ్వ వేరు.. ఇప్పుడు విశ్వ వేరు’ అని షణ్ముఖ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇలా అందరూ తమ తమ వాదనలు వినిపించారు. అనంతరం.. సిరి, షణ్ముఖ్‌, జస్వంత్‌ మీ ముగ్గురికీ అంటూ బిగ్‌బాస్‌ చిన్న గ్యాప్‌ ఇవ్వగానే ఈ ముగ్గురూ చాలా టెన్షన్‌ పడ్డారు. ఈ సీన్‌తో ప్రోమో ముగిసింది. మరి బిగ్‌బాస్‌ ఈ ముగ్గురి గురించి ఏం చెప్పాడు? ఎవరు ఎవర్ని నామినేట్‌ చేశారు? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. నామినేషన్స్‌ తర్వాత ఎవరు? ఎవరెవరిని నామినేట్‌ చేశారో బిగ్‌బాస్‌ స్క్రీన్‌పై చూపించారు. దీంతో నామినేషన్స్‌పై చర్చ మొదలైంది. ఫుడ్‌ విషయంలో శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌, సిరి, జస్వంత్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని