BiggBoss Telugu5: ఇక్కడ అందరూ ఒకటే.. అన్నా అనాల్సిన అవసరం లేదు
‘బిగ్బాస్ తెలుగు 5’ కొత్త ప్రోమోలు. ఛాలెంజ్ కోసం సన్నీ, మానస్ ఏ జట్టుని ఎంపిక చేసుకున్నారు?
ఇంటర్నెట్ డెస్క్: బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తోన్న కార్యక్రమం ‘బిగ్బాస్’. ప్రస్తుతం 5వ సీజన్ ప్రసారమవుతోంది. ఈ షోకి ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. మంగళవారం బిగ్బాస్ ఇంటి సభ్యులకి కొత్త టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హౌస్మేట్స్ ఇద్దరిద్దరు ఓ టీమ్గా ఏర్పడ్డారు. నటరాజ్- లోబో, జశ్వంత్- కాజల్, శ్రీరామ్- హమీదా, శ్వేతవర్మ- అనీ మాస్టర్, ప్రియ- ప్రియాంక, రవి- విశ్వ, సన్నీ- మానస్, షణ్ముఖ్- సిరి జట్టుగా నిలిచారు. వీరంతా ఏం చేశారంటే? ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే. దానికి సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. వీటిల్లోని సంగతులేంటంటే..
ప్రోమో 1: తను సూచించిన అతి ముఖ్యమైన నియమాల్ని ఉల్లంఘించినందుకు జశ్వంత్తోపాటు అతని జట్టులోని కాజల్ని కెప్టెన్సీకి అనర్హులుగా ప్రకటిస్తాడు బిగ్బాస్. దాంతో జశ్వంత్ కోపం ప్రదర్శిస్తాడు. ‘ఇక్కడ అందరూ ఒకటే. ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. అందర్నీ పేరు పెట్టి పిలువు. అన్న అని అనాల్సిన అవసరం లేదు’ అని జశ్వంత్కి సలహా ఇస్తాడు షణ్ముఖ్.
ప్రోమో 2: ఇంటి సభ్యుల ఆకలి తీర్చేందుకు ‘ఫుడ్బండి’ మటన్ బిర్యానీ తీసుకొస్తుంది. దాన్ని ఆరగించి, ‘మాస్ బిర్యానీ’ పాటకి హౌజ్మేట్స్ డ్యాన్స్ చేస్తారు. నటరాజ్- లోబో సరదా కబుర్లు, రవి- షణ్ముఖ్ సీరియస్ చర్చలు వినిపించాయి. అనంతరం.. ఓ ఛాలెంజ్ కోసం మరో జంటని ఎంపిక చేసుకోమని సన్నీ- మానస్ని బిగ్బాస్ ఆదేశిస్తాడు. మరి వీళ్లు ఏ జట్టుని తీసుకున్నారు?ఆ ఛాలెంజ్ ఏంటి? తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..