Bigg Boss Telugu 5: మానస్‌-ప్రియాంక హనీమూన్‌ టూర్‌..!

బిగ్‌బాస్‌ ఇచ్చిన కేక్‌ పీస్‌ని తినే అర్హత ఎవరికి ఉందనే విషయంలో ఇంటిసభ్యుల మధ్య చర్చ జరిగింది. పైకి తామే తినాలనుకుంటున్నామని చెబుతున్నా.. లోపల మాత్రం తింటే ఏమవుతుందోనని అందరూ...

Updated : 11 Nov 2021 09:54 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ ఇచ్చిన కేక్‌ పీస్‌ని తినే అర్హత ఎవరికి ఉందనే విషయంలో ఇంటిసభ్యుల మధ్య చర్చ జరిగింది. తామే తినాలనుకుంటున్నామని పైకి చెబుతున్నా.. లోపల మాత్రం తింటే ఏమవుతుందోనని అందరూ కంగారుప్డడారు. అది తింటే ఇమ్యూనిటీ వస్తుందా? లేక శిక్ష పడుతుందా? అన్న దానిపై మాట్లాడుకున్నారు. ‘‘బిగ్‌బాస్‌.. నేను ఈ ఇంటి కెప్టెన్‌ కదా.. ఆ కేక్‌ తినొచ్చా’’ అని అనీమాస్టర్‌ బిగ్‌బాస్‌ని అడిగింది. ఈ క్రమంలోనే ఆ కేక్‌ పీస్‌ని తినే అర్హత ఎవరికి ఉందనే విషయంపై తన అభిప్రాయాన్ని చెప్పమని సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న జెస్సీని బిగ్‌బాస్‌ కోరగా.. అతను రవి పేరు చెప్పాడు. ఆ కేక్‌ను మానస్‌ తింటే బాగుంటుందని ప్రియాంక అనుకుంది. ఇదిలా ఉండగా ఉదయం నిద్ర లేవగానే ఆకలి వేస్తుందంటూ సన్నీ ఆ కేక్‌ తినేశాడు. హౌస్‌మేట్స్‌ అందరూ నవ్వుకున్నారు. సన్నీ కేక్‌ తిన్నాడన్న విషయం తెలియగానే అనీమాస్టర్‌ గుండెలు బాదుకుంటూ వచ్చింది. ఆ కేక్‌ తినే అర్హత కెప్టెన్‌గా తనకే ఉందని గొడవ చేసింది. ‘‘మీరు తినాలి అనుకుంటే నిన్నే తినొచ్చు కదా.. ఏదైతే అదే అవుతుందని నేనే తినేశా’’ అని సన్నీ సమాధానమిచ్చాడు.

కెప్టెన్సీ టాస్క్‌ బీబీ హోటల్‌

గత సీజన్‌లో పెట్టిన బీబీ హోటల్‌ టాస్క్‌నే ఈ సీజన్‌లోనూ బిగ్‌బాస్‌ రిపీట్‌ చేశాడు. శ్రీరామ్‌, షణ్ముఖ్‌ హోటల్‌ స్టాఫ్‌గా.. రవి హౌస్‌ కీపింగ్‌ చేసే వ్యక్తిగా, అనీమాస్టర్‌ మేనేజర్‌గా మారారు. మానస్‌-ప్రియాంక హనీమూన్‌కు వచ్చిన జంటగా, సన్నీ మొదటిసారి ఫైవ్‌స్టార్‌ హోటల్‌కి వచ్చిన అతిథిగా.. సిరి ఓ డాన్‌ కుమార్తెగా నటించారు.

రవికి సీక్రెట్‌ టాస్క్‌..

బీబీ హోటల్‌ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ రవికి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు. హోటల్‌ సాఫ్ట్‌ చేసే పనులు చెడకొట్టడంతోపాటు హోటల్‌కు వచ్చే అతిథుల మెప్పు పొందాలని బిగ్‌బాస్‌ సూచించాడు. ఎంతో హుషారుగా, సరదాగా సాగుతున్న కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విజయం సాధిస్తారు? సీక్రెట్‌ టాస్క్‌లో రవి గెలిచాడా?అన్నవిషయం తెలియాలంటే ఈ రోజు ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే..!

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని