ఓటీటీలోకి.. ‘షేర్షా’, ‘బ్లాక్‌ విడో’

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో చాలా చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోనే నిలిచాయి ‘షేర్షా’, ‘బ్లాక్‌ విడో’ చిత్రాలు. ఈ సినిమాల్ని డిజిటల్‌ మాధ్యమాల్లో విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాయి చిత్ర బృందాలు.

Published : 15 Jul 2021 13:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా థియేటర్లు ఇంకా పూర్తిస్థాయిలో తెరచుకోకపోవడంతో చాలా చిత్రాలు ఓటీటీ బాట పడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోనే నిలిచాయి ‘షేర్షా’, ‘బ్లాక్‌ విడో’ చిత్రాలు. ఈ సినిమాల్ని డిజిటల్‌ మాధ్యమాల్లో విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించాయి చిత్ర బృందాలు. సిద్దార్థ మల్హోత్రా, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమే ‘షేర్షా’. విష్ణువర్ధన్‌ దర్శకుడు. ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్, క్యాష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కార్గిల్‌ యుద్ధ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌లో ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. స్కార్లెట్‌ జాన్సెన్‌ నటించిన హాలీవుడ్‌ చిత్రం ‘బ్లాక్‌విడో’ డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. విడుదల తేదీని అతి త్వరలోనే ప్రకటించనున్నారు. మార్వెల్‌ స్టూడియోస్‌ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్టు ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అలరించనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని