Bullet Satyam: బుల్లెట్‌ రాజకీయం

దేవరాజ్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బుల్లెట్‌ సత్యం’. సోనాక్షి వర్మ కథా నాయిక. మధు గోపు దర్శకత్వం వహించారు. ఈ నెల 10న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 09 Dec 2021 09:18 IST

దేవరాజ్‌ కథానాయకుడిగా నటిస్తూ నిర్మించిన చిత్రం ‘బుల్లెట్‌ సత్యం’. సోనాక్షి వర్మ కథా నాయిక. మధు గోపు దర్శకత్వం వహించారు. ఈ నెల 10న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ  సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో సినిమా ట్రైలర్‌ని ప్రముఖ నటుడు వినోద్‌ కుమార్‌ విడుదల చేశారు. ప్రసాద్‌వర్మ, శంకర్‌, అభిలాష్‌రెడ్డి తదితరులు ఈ వేడుకకి అతిథులుగా హాజరయ్యారు. వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిగా ఇందులో నటించా. కుటుంబ బంధాలతోపాటు, రాజకీయ నేరాలు, థ్రిల్లర్‌ అంశాల్ని మేళవించి ఓ విభిన్నమైన కథతో ఈ సినిమాని   తెరకెక్కించాడు నిర్మాత. కథానాయకుడిగా నటిస్తూ చక్కటి ప్రణాళికతో ఈ సినిమాని రూపొందించాడు. ఒక మంచి బృందం కలిసి చేసిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంద’’న్నారు. హీరో, నిర్మాత మాట్లాడుతూ ‘‘గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. బుల్లెట్‌ సత్యం చేసిన రాజకీయం ఎలాంటిదన్నది తెరపైనే చూడాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చలాకీచంటి, ధన్‌రాజ్‌, గీత రచయిత రాంబాబు గోసాల తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని