Sai Dharam Tej: నిర్లక్ష్యపు, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద సాయితేజ్‌పై కేసు

రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated : 11 Sep 2021 18:03 IST

హైదరాబాద్‌ : రోడ్డు ప్రమాదానికి గురైన సినీ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌పై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యపు, ర్యాష్‌ డ్రైవింగ్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 8.05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా పోలీసులు గుర్తించారు. సాయితేజ్‌ స్పోర్ట్స్‌ బైక్‌ని స్వాధీనం చేసుకుని.. రాయదుర్గం పోలీసుస్టేషన్‌కు తరలించారు.

మరోవైపు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఈ ఉదయం బులెటిన్‌ విడుదల చేశారు. సాయి తేజ్‌ని పలువురు సినీ ప్రముఖులు ఆస్పత్రిలో పరామర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు