Mega 154: 154వ చిత్రం ఆరంభం

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 154వ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌చ్చారు. పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

Updated : 07 Nov 2021 06:57 IST

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న 154వ చిత్రం శనివారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తం సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌చ్చారు. పూరి జగన్నాథ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకులు కొరటాల శివ, హరీష్‌శంకర్‌, మెహర్‌ రమేష్‌, బుచ్చిబాబు, శివ నిర్వాణ కలిసి స్క్రిప్ట్‌ని చిత్రబృందానికి అందజేశారు. నాగబాబు, ఛార్మి, బుచ్చిబాబు, బి.వి.ఎస్‌.రవి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. మాస్‌ అవతారంతో ఒకప్పటి   చిరంజీవిని గుర్తు చేసేలా పోస్టర్‌ని సిద్ధం చేసి   ‘అరాచకం ఆరంభం’ అనే వ్యాఖ్యతో విడుదల చేసింది చిత్రబృందం. డిసెంబర్‌లో చిత్రీకరణ ఆరంభిస్తారు. మాస్‌ కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్‌.ఎ విల్సన్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కూర్పు: నిరంజన్‌ దేవరమనే, కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సుస్మిత కొణిదెల, ప్రొడక్షన్‌   డిజైనర్‌: ఎ.ఎస్‌.ప్రకాశ్‌, కథ, మాటలు: బాబీ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తిరెడ్డి,  పోరాటాలు: రామ్‌లక్ష్మణ్‌, సహనిర్మాత: జి.కె.మోహన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని