Chiranjeevi: సాయిధరమ్‌ తేజ్‌కి మీ ఆశీస్సులు అలా అందుతాయని ఆశిస్తున్నా!

సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి చిరంజీవి ఏమన్నారంటే.. 

Published : 30 Sep 2021 21:10 IST

హైదరాబాద్‌: తన మేనల్లుడు, నటుడు సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకుంటున్నాడని తెలియజేశారు మెగాస్టార్‌ చిరంజీవి. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం అక్టోబరు 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్‌ చేశారు. ‘సాయిధరమ్‌ తేజ్‌ త్వరగా కోలుకుంటున్నాడు. ‘రిపబ్లిక్‌’ చిత్ర విజయం రూపంలో అతనికి మీ అందరి ఆశీస్సులు అందుతాయని ఆశిస్తున్నా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. కొవిడ్‌ కారణంగా కుదేలైన ఎగ్జిబిటర్లకి ఈ సినిమా మంచి ఫలితం అందించాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

దేవ కట్టా దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించారు. స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని