Chiranjeevi Kapil Dev: ఇద్దరు మిత్రులు కలిసిన వేళ..!

నటుడు చిరంజీవి టీమిండియా మాజీ సారథి కపిల్ దేవ్‌ని కలిశారు. 

Published : 29 Aug 2021 22:40 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు చిరంజీవి, టీమిండియా మాజీ సారథి కపిల్‌ దేవ్‌ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో సందడి చేశారు. స్నేహితులైన ఈ ఇద్దరూ చాలాకాలం తర్వాత కలుసుకుని, గత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘నా స్నేహితుడు కపిల్‌ దేవ్‌ని చాలాకాలం తర్వాత కలిశాను. గతంలో మా మధ్య చోటుచేసుకున్న మధుర జ్ఞాపకాల్ని నెమరువేసుకున్నాం. ఇందుకు ఫలక్‌నుమా ప్యాలెస్‌ వేదికైంది’ అని తెలిపారు. సంబంధిత ఫొటోల్ని షేర్‌ చేశారు. చిరంజీవితోపాటు ఆయన సతీమణి సురేఖ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని