MAA Elections: మేనిఫెస్టోని ప్రకటించిన సీవీఎల్ నరసింహారావు
నటీనటుల వాడీవేడీ చర్చలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ప్రకాశ్రాజ్-మంచువిష్ణు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో తలపడుతున్నారు...
హైదరాబాద్: నటీనటుల వాడీవేడీ విమర్శలు, ప్రతి విమర్శలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో ప్రకాశ్రాజ్-మంచువిష్ణు ప్రధాన అభ్యర్థులుగా పోటీలో తలపడుతున్నారు. కాగా, ‘మా’ అధ్యక్ష పదవి కోసం తాను కూడా పోటీ చేస్తున్నానని ప్రకటించిన నటుడు సీవీఎల్ నరసింహారావు తాజాగా తన మేనిఫెస్టోని ప్రకటించారు. మరో రెండు రోజుల్లో తాను మీడియా ముందుకు వస్తానని చెప్పారు.
మేనిఫెస్టో..
* ఆర్టిస్టులందరికీ అవకాశాలు వచ్చేలా చూడడం. ఈ మేరకు 2011లో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు కచ్చితంగా అమలు అయ్యేలా చేయడం. ఆ నిర్ణయాలు అమలుచేయడానికి 50 మంది సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు. ఈ మేరకు ఆ 50 మంది సభ్యుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తాను.
* అసోసియేషన్లోని ప్రతిసభ్యుడికీ సంవత్సరానికి రూ.3 లక్షలు ఆరోగ్య బీమా ‘మా’ చెల్లిస్తుంది. అది వచ్చే ఏడాది జనవరి నుంచి అన్ని విధాలుగా అమలయ్యేలా చేస్తాం.
* ఫిలింనగర్ కల్చరల్ క్లబ్లో ‘మా’ సభ్యుడికి అసోసియేట్ మెంబర్షిప్ సంపాదించడం.
* వృద్ధ కళాకారులకు ప్రస్తుతం రూ.6 వేలు పింఛను ఇస్తున్నారు. నవంబర్ నుంచి రూ.10 వేలు ఇచ్చేలా చర్యలు.
* 20 ఏళ్ల క్రితం మహిళల కోసం ప్రవేశపెట్టిన ‘ఆసరా’ని పునఃప్రారంభిస్తాం. ఆసరా కమిటీలో ఉండే 13 మంది పేర్లను త్వరలోనే ప్రకటిస్తాను.
* ఎవరైనా ‘మా’ సభ్యుడు ఆకలి భాధలు పడుతుంటే.. కాల్ చేసిన రెండు గంటల్లోనే అతడి ఇంటికి నెల రోజులకు సరిపడా వంట సామగ్రిని పంపిస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..