Cinema News: ‘దక్ష’ ఎవరు?
ప్రముఖ నటుడు శరత్బాబు సోదరుడి తనయుడు ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’. అను, నక్షత్ర కథానాయికలు. వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. ఈ సినిమా టైటిల్
ప్రముఖ నటుడు శరత్బాబు సోదరుడి తనయుడు ఆయుష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘దక్ష’. అను, నక్షత్ర కథానాయికలు. వివేకానంద విక్రాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తల్లాడ శ్రీనివాస్ నిర్మాత. ఈ సినిమా టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ నటులు శరత్బాబు, తనికెళ్ల భరణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ ‘‘శరత్బాబు నాకు మంచి మిత్రుడు. ఎన్నో చిత్రాల్లో కలిసి పనిచేశాం. ఆయన ఆయుష్ని పరిచయం చేయాలని చెప్పినప్పుడు నేను ఈ చిత్ర సహ నిర్మాత సాయికృష్ణ పేరు సూచించా. తను దర్శకత్వం వహించిన ఓ లఘు చిత్రానికి జాతీయ పురస్కారం వచ్చింది. తను తన సహచరుడిని దర్శకుడిని చేసి ఈ సినిమాని ముందుండి నడిపించాడు. తను గొప్ప స్థాయికి చేరుకుంటాడు. ఒక మంచి బృందం కలిసి ఈ సినిమా చేసింది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు. శరత్బాబు మాట్లాడుతూ ‘‘ఆయుష్ నా దగ్గరే పెరిగాడు. తను నా బిడ్డే. పిల్లల తమ కంటే ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటారు కదా, అలా ఆయుష్ తనదైన ప్రత్యేకతతో పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ‘దక్ష’తో అందరికీ పేరు, లాభాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అన్నారు. ఆయుష్ మాట్లాడుతూ ‘‘హీరో కావాలనేది నా కల. ముంబయిలో శిక్షణ తీసుకున్నా. ‘దక్ష’ ఒక థ్రిల్లర్ చిత్రం. ఇందులో దక్ష ఎవరు? ఆ వ్యక్తి వెనక కథేమిటన్నది తెరపైనే చూడాలి. జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లాడ వెంకన్నతోపాటు పలువురు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).