Maha Samudram: అలాంటి పాత్రలు నా సినిమాల్లో ఉండవు: అజయ్ భూపతి
డైరెక్టర్ అజయ్ భూపతి ఇంటర్వ్యూ. సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా ఆయన తెరకెక్కించిన ‘మహా సముద్రం’ అక్టోబరు 14న విడుదల కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్, సిద్ధార్థ్, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అజయ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ.
అందులో కిక్ ఉంటుంది..
‘ఆర్ఎక్స్ 100’ చిత్రం తర్వాత ఫలానా కథని తెరకెక్కించండి అంటూ నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, నేను అంగీకరించలేదు. ‘మహా సముద్రం’ కథ మీదే దృష్టిపెట్టాను. ఈ సినిమా కాన్సెప్ట్ ‘ఆర్ఎక్స్ 100’ కంటే ముందే నా మదిలో మెదిలింది. కొన్నాళ్ల తర్వాత పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకుని పట్టాలెక్కించా. ఇద్దరు హీరోలతో సినిమా చేయడంలో ఓ కిక్ ఉంటుంది. కథ పూర్తయ్యాక చాలామంది హీరోల్ని కలిశా. కథ నచ్చినా వారి పరిస్థితుల మేరకు చేయలేమని చెప్పారు. చివరగా శర్వానంద్, సిద్ధార్థ్ ఒకే చేశారు. పాత్రల నిడివి గురించి వారు ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రతి విషయంలోనూ వారు నాకెంతో సహకరించారు. లవర్బాయ్ ఇమేజ్ ఉన్న సిద్ధార్థ్ ఈ చిత్రంలో పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. అది ఓ రకంగా సినిమాపై ఆసక్తిని పెంచే అంశమే!
నాయికా పాత్రకి ప్రాధాన్యం..
ఏ సినిమాలోనైనా నాయికా పాత్ర బలంగా ఉంటే ఆ సినిమా విజయం సాధిస్తుందనేది నా నమ్మకం. ఆ ఉద్దేశంతోనే నేను పాత్రల్ని సృష్టిస్తా. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే హీరోయిన్ పాత్రలు నా సినిమాల్లో ఉండవు. ఈ విషయంలో దర్శకుడు బాల చందర్ నాకు స్ఫూర్తి. ‘మహా సముద్రం’ చిత్రంలో ‘మహా’ అనే నాయిక పాత్ర చాలా కీలకమైంది. ఫలానా కథానాయికని దృష్టిలో పెట్టుకుని రాసిన పాత్ర కాదిది. రాయడం పూర్తయ్యాకే దీన్ని పోషించేందుకు అదితిరావు హైదరీ, సమంతలాంటి వారు అయితే బాగుంటుంది అనుకున్నా. ముందుగా అదితికి కథ చెప్పడంతో ఆమెకి బాగా నచ్చి, ఒకే చేశారు.
వైజాగ్ని కొత్తగా చూపించాం..
విశాఖపట్నం సముద్ర తీరం నేపథ్యంలో సాగే కల్పిత కథ ఇది. స్నేహితులు, ప్రేమికులు.. ఇలా కొన్ని ఉపకథలు కనిపిస్తాయి. ఈ చిత్రంలో స్నేహితుడంటే ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేశా. వైజాగ్ని ఇప్పటి వరకూ ఎవరూ చూపించని విధంగా మేం చూపించాం. హీరోహీరోయిన్ల పాత్రలే కాదు ప్రతీ పాత్రకి మంచి గుర్తింపు ఉంటుంది. సినిమా చూశాక మీకు నటులు గుర్తుండరు వారు పోషించిన పాత్రలే గుర్తుకొస్తాయి. సందర్భానుసారం వచ్చే సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. నేను ఎలాంటి సంగీతాన్ని కోరుకుంటానో చేతన్ భరద్వాజ్కి బాగా తెలుసు. ఈ సినిమానికి ఆయన అందించిన సంగీతం ప్రధానబలంగా నిలుస్తుంది. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది.
పాన్ ఇండియా కథ..
నా తొలి చిత్రం చాలా భాషల్లో రీమేక్ అయింది. అది పాన్ ఇండియా కథ. ‘మహా సముద్రం’ కూడా అంతే. అన్ని ప్రాంతాల వారికి రీచ్ అవుతుంది. ప్రస్తుతానికి తమిళంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. అన్ని జానర్ల సినిమాలను తెరకెక్కించాలనే కోరిక ఉంది. త్వరలోనే ఓ మాస్ ఎంటర్టైనర్ చిత్రాన్ని ప్రకటిస్తా. ఓటీటీ కోసం ఓ కథకి దర్శకత్వం వహిస్తున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా