Gowtam Tinnanuri: అంతకు మించి అనేలా..

‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ప్రస్తుతం హిందీ ‘జెర్సీ’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇది స్పోర్ట్స్‌ డ్రామా

Updated : 16 Dec 2021 07:22 IST

‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ చిత్రాలతో సినీప్రియుల్ని మెప్పించిన దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. ప్రస్తుతం హిందీ ‘జెర్సీ’తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన తెలుగులో రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఇది స్పోర్ట్స్‌ డ్రామా కథాంశంతో రూపొందనుందని, సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కుతుందని రకరకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ చిత్ర కథాంశంపై గౌతమ్‌ ఓ జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. చరణ్తో చేయనున్న సినిమా యాక్షన్‌ కథాంశంతో ఉంటుందని తెలియజేశారు. అది పాన్‌ ఇండియా చిత్రమని.. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే అంతకు మించిన స్థాయిలోనే ఉంటుందని చెప్పారు. అలాగే ఇందులో చిరంజీవి నటించనున్నారనే పుకార్లకు ఈ ఇంటర్వ్యూ ద్వారా చెక్‌ పెట్టారు గౌతమ్‌ తిన్ననూరి. ఈ సినిమాలో ఆయనకు సరిపడే పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం చరణ్‌ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలకు సిద్ధమవుతుండగా.. శంకర్‌తో చేస్తున్న కొత్త సినిమా సెట్స్‌పై ముస్తాబవుతోంది. ఈ చిత్రం పూర్తయిన వెంటనే గౌతమ్‌ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని