KarunaKumar: రూ.10 వ్యయం అయ్యే పనిని, రూ.8కే చేసి చూపించాలని తపిస్తుంటా!
అంతర్జాలం విస్తృతి పెరిగాక...మనందరం జాతీయ అంతర్జాతీయ సినిమాలు చూడటం మొదలు పెట్టాక తెలుగులో ఇలాంటివి రావడం లేదే అనే ప్రశ్న మొదలైందని చెబుతున్నారు దర్శకుడు కరుణ కుమార్.....
అంతర్జాలం విస్తృతి పెరిగాక...మనందరం జాతీయ అంతర్జాతీయ సినిమాలు చూడటం మొదలు పెట్టాక తెలుగులో ఇలాంటివి రావడం లేదే అనే ప్రశ్న మొదలైందని చెబుతున్నారు దర్శకుడు కరుణ కుమార్. ‘పలాస 1978’తో విజయాన్ని అందుకున్న దర్శకుడాయన. ఇటీవల సుధీర్బాబు హీరోగా ‘శ్రీదేవి సోడాసెంటర్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ఈ నెల 27న రానుంది. ఈ సందర్భంగా కరుణకుమార్ బుధవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘పది పద్నాలుగేళ్లుగా మనం కథలు చెప్పడం మరిచిపోయాం. ఒక మూస ధోరణిలో వెళ్లిపోతున్నాం. పరభాషా సినిమాల్ని చూసి మెచ్చుకుంటున్నాం తప్ప..మనం అలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. ‘శంకరాభరణం’, ‘సిరివెన్నెల’, ‘జ్యోతి’, ‘విజేత’, ‘ఛాలెంజ్’... ఇలాంటి కళాత్మకమైన సినిమాలు ఒకప్పుడు తెలుగులో వచ్చినంతగా ఏ భాషలో రాలేదు. తెలుగువాళ్లు కథలు చెబితే వినడానికి సిద్ధంగా ఉంటారని ప్రపంచం మొత్తాన్ని ఊపేసిన ‘అరుంధతి’, ‘బాహుబలి’లాంటి చిత్రాలు నిరూపించాయి. కథల్నే చెబుదామని నేను పరిశ్రమలోకి వచ్చా. అలా ఓ బలమైన కథని చెప్పినప్పుడు ఒప్పుకుని ‘పలాస’ రూపంలో తొలి అవకాశం ఇచ్చారు నిర్మాతలు. అలా మరో బలమైన సమస్యని ‘శ్రీదేవి సోడా సెంటర్’లో చర్చించాం. ‘పలాస’ తరహాలో కాకుండా... కొంచెం భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇప్పటివరకు గోదావరి జిల్లాలంటే అరిటాకులు, అమ్మమ్మల ఆప్యాతలు, పొలంగట్లనే తెరపై చూశాం. అక్కడి సామాజిక, ఆర్థిక కోణాల్ని, ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమాతో చేశాం. ఈ కథలో ఓ ప్రేమకథ కూడా ఉంటుంది.నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించాం’’.
‘‘గ్రామాల్లో అల్లరి చిల్లరిగా కనిపించే ఓ తెలివైన సాధారణమైన ఎలక్ట్రీషియన్గా కనిపిస్తాడు కథానాయకుడు. ఓ సోడాసెంటర్ యజమాని కూతురు కథానాయిక. వీరి మధ్య చిగురించిన ప్రేమే ఈ చిత్రం. ఆ ప్రేమ తాలూకు పర్యవసనాలు, దాని వెనక సాంఘిక సామాజిక ఆర్థిక పరమైన ఇబ్బందుల మధ్య ఆ జంటకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఆసక్తికరం’’.
‘‘నేను తీసే ప్రతి సినిమా భిన్నంగా ఉండాలని కోరుకుంటా. నేను రాసుకునే ప్రతి కథకీ ఆ కథే హీరో. నా కథని నమ్మిన వాళ్లతోనే సినిమాలు చేస్తాను. ‘పలాస’లో మొత్తం తెలుగువాళ్లే నటించారు. ఇందులో కూడా 99 శాతం తెలుగు నటులే. ఈ సినిమా విడుదల తర్వాతే తదుపరి సినిమా ఎవరితో అనేది చెబుతా. పది రూపాయలు వ్యయం అయ్యే పనిని, రూ.8కే చేసి చూపించాలని తపిస్తుంటా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు