Puri Jagannadh: అభిమాన దర్శకుడ్ని కలిసిన ఆనందం వెంటే బాధ!

తమ అభిమాన నటుల్ని, దర్శకుల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని, కలుసుకోవాలని ఎంతోమంది ఉవ్విళ్లూరుతుంటారు. ఆ అవకాశం అనుకోకుండా వస్తే?

Published : 26 Oct 2021 01:40 IST

ముంబయి: తమ అభిమాన నటుల్ని, దర్శకుల్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలని, కలుసుకోవాలని ఎంతోమంది ఉవ్విళ్లూరుతుంటారు. ఆ అవకాశం అనుకోకుండా వస్తే? ఆ సెలబ్రిటీలు అకస్మాత్తుగా ఎదురైతే? ఆ భావాన్ని మాటల్లో చెప్పలేం. రాతల్లో వర్ణించలేం. కానీ, వారిచ్చిన ఆటోగ్రాఫ్‌, వారితో దిగిన ఫొటోలని మనకు తెలిసిన వారికి చూపించి ఆనందాన్ని పంచుకుంటుంటాం. మరి మనం ఎంతగానో ఆరాధించే దర్శకుడ్ని కలిసి, తనతో ఫొటో దిగలేకపోతే.. ఫొటో తీసుకునేందుకు మన దగ్గర ఫోన్‌ లేకపోతే? ఎంత బాధగా ఉంటుంది!

ఇలాంటి అనుభవమే ఎదురైంది ప్రమోద్‌ అనే కుర్రాడికి. తను అభిమానించే టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌ని అనుకోకుండా కలిశాననే అమితానందం ఉన్నా ఆయనతో సెల్ఫీ తీసుకోలేకపోయాననే బాధే తనలో ఎక్కువగా కనిపించింది. ముంబయిలో జరిగిన ఈ దృశ్యాన్ని నటి, ఛార్మి సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్‌ చేశారు. ‘పూరి జగన్నాథ్‌ ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద ఆగింది. అదే సమయంలో అటుగా వెళ్తోన్న ప్రమోద్‌ అనే అబ్బాయి పూరి జగన్నాథ్‌ని కలిసి, కాసేపు మాట్లాడాడు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ప్రమోద్‌ దగ్గర ఫోన్‌లేదు. తన కోసమే ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నా’ అని తెలిపారు. దీన్ని చూసిన సినీ ప్రముఖులు, పూరి జగన్నాథ్‌ అభిమానులు ఆయన్ను ప్రశంసిస్తున్నారు. పూరి జగన్నాథ్‌- ప్రమోద్‌ మధ్య సాగిన ఆ సంభాషణ ఏంటో మీరే చూడండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని