Puneeth Rajkumar: ‘గంధద గుడి’.. పునీత్‌కి అసలైన నివాళి ఇదే: రాజమౌళి

కన్నడ నటుడు దివంగత పునీత్‌  రాజ్‌కుమార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘గంధద గుడి’. ఆయన నటించిన చివరి చిత్రమిది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 09 Dec 2021 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కన్నడ నటుడు దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘గంధద గుడి’. ఆయన నటించిన చివరి చిత్రమిది. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌ను చూసిన ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించారు. సంబంధిత వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గంధద గుడి’ టీజర్‌ చాలా అద్భుతంగా ఉంది. ఈ చిత్రం పునీత్‌కి అసలైన నివాళిగా నిలుస్తుంది. కర్ణాటక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే అప్పూ కల ప్రశంసనీయమైంది’ అని అన్నారు. ఈ చిత్రానికి అమోఘవర్ష దర్శకత్వం వహిస్తున్నారు. అజనీశ్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందిస్తున్నారు. కర్ణాటకలోని వైల్డ్​లైఫ్​ ఆధారంగా ఈ ప్రాజెక్ట్‌ రూపొందుతోంది. ఈ సినిమాకి పునీత్​ నిర్మాతగానూ వ్యవహరించారు. దర్శకుడు అమోఘవర్షతో కలిసి తెరను పంచుకున్నారు. గుండెపోటు కారణంగా పునీత్‌ చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన అకాల మరణాన్ని చిత్ర వర్గాలు, సినీ ప్రేక్షకులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని