Drushyam 2: రాంబాబులాంటి తండ్రి ప్రతి ఇంట్లోనూ ఉండాలి
‘‘నేను ఎప్పుడు కొత్త రకమైన సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈసారి వాళ్లకి ‘దృశ్యం2’ మరింత బాగా నచ్చుతుంది’’ అన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది.
‘‘నేను ఎప్పుడు కొత్త రకమైన సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈసారి వాళ్లకి ‘దృశ్యం2’ మరింత బాగా నచ్చుతుంది’’ అన్నారు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఆయనకి భార్యగా మీనా నటించారు. విజయవంతమైన ‘దృశ్యం’కి కొనసాగింపు చిత్రమిది. జీతూ జోసెప్ దర్శకుడు. డి.సురేష్బాబు, ఆంటోనీ పెరంబవూర్, రాజ్కుమార్ సేతుపతి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్లో ట్రైలర్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ‘‘నేను ‘దృశ్యం’ చేశాక మళ్లీ అలాంటి సినిమా చేయాలనుకునేవాణ్ని. జీతూ మళ్లీ కొనసాగింపు చిత్రంతో రావడం ఆనందంగా ఉంది. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఎన్నో భావోద్వేగాలు, మలుపులు ఉన్నాయి. వినోదం, డ్రామా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జీతూ జోసెఫ్ అద్భుతమైన స్క్రిప్ట్ రాశారు. ఈమధ్యకాలంలో అలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్స్ రాలేదు. మోహన్లాల్, మీనా మలయాళంలో చాలా బాగా చేశారు. ఈ సినిమాని ఓ సవాల్గా తీసుకుని చేశా. ప్రతి ఇంట్లోనూ తన కుటుంబంకోసం ఏమైనా చేసే రాంబాబులాంటి తండ్రి ఉండాలి’’ అన్నారు. జీతూ జోసెఫ్ మాట్లాడుతూ ‘‘నేను దృశ్యం’ చేశాక దానికి కొనసాగింపుగా మరో స్క్రిప్ట్ చేయమని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి శ్రీప్రియ మేడమ్. తెలుగు ప్రేక్షకులకి, ఇక్కడి సంస్కృతికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశాం. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం2’ చూశాక దర్శకుడు రాజమౌళి నాకు సందేశం పంపించారు. అప్పుడు నేను నా కుటుంబంతో కలిసి హైదరాబాద్లోనే ఉన్నా. ఆయన్నుంచి సందేశం చూశాక నమ్మశక్యంగా అనిపించలేదు. వెంటనే ఆ సందేశాన్ని సామాజిక సందేశాల్లో పంచుకున్నా’’ అన్నారు. శ్రీప్రియ మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి ‘దృశ్యం’ సినిమాని నేనే తెరకెక్కించా. ఈ చిత్రాన్ని మాత్రం జీతూనే చేశాడు. ఒక పిల్లవాణ్ని తీసుకుని మళ్లీ అతని నిజమైన తండ్రికి తిరిగి ఇచ్చినట్టుగా ఉంది. రాంబాబు పాత్రకి వెంకటేష్ తప్ప మరొకరు ఎవ్వరూ ఆ స్థాయిలో ఫిట్ కాలేరు. సెట్లో కూడా ఎప్పుడూ తన పిల్లలు, కుటుంబం గురించి మాట్లాడుతూనే ఉంటారు. అందుకే ఈ పాత్రలో అంతగా ఒదిగిపోయాడ’’న్నారు. మీనా మాట్లాడుతూ ‘‘నేను, వెంకటేష్ కొత్తలో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం కాదు. కలిసి కొన్ని సినిమాలు చేశాక మామధ్య అనుబంధం పెరిగింది. ‘దృశ్యం2’ కోసం చేసిన ప్రయాణం చాలా బాగుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్కుమార్ సేతుపతి, సంపత్, సుజ, ఎస్తేర్, అనూప్ రూబెన్స్, చంద్రబోస్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టైలిష్... ‘రాబిన్ హుడ్’
‘రాబిన్హుడ్’గా ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా డిసెంబరు 20న థియేటర్లలోకి రానుంది. -
చేసింది దేశం కోసమేనని నమ్ముతున్నావా?
‘ఈ దేశాలు, సరిహద్దులు ఇసుకలో గీసిన గీతల్లాంటివి. వాటికి ఎలాంటి విలువ ఉండదు. దాగి ఉన్న అబద్ధాలతో దేశం మోసపోయింది’ అంటూ ‘ఉలఝ్’ ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది అందాల నాయిక జాన్వీ కపూర్. -
వినాయక చవితికి ‘సుందరకాండ’
కథానాయకుడు నారా రోహిత్ కొత్త కబురు వినిపించారు. తన 20వ చిత్రంతో వెంకటేశ్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘సుందరకాండ’ అనే సినిమా చేస్తున్నారు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
మాస్.. కాళి
విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం కొత్త సినిమాని ప్రకటించారు. ‘వీర ధీర శూరన్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ఆయనకి 62వ చిత్రం. ఎస్.యు.అరుణ్కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, రియా శిబు నిర్మిస్తున్నారు. -
బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది లేదు
‘బిబ్బోజాన్కి స్వేచ్ఛ కంటే గొప్పది మరొకటి లేదు. అంతేకాదు, స్వేచ్ఛను కోరుకునే ఈమె తన విప్లవాన్ని ప్రేమ అనే స్పర్శతో నడిపిస్తుంది’ అంటూ ‘హీరామండీ: ది డైమండ్ బజార్’లోని అదితీరావ్ హైదరీ పాత్రను పరిచయం చేసింది ఆ సిరీస్బృందం. -
హిట్టు జోడీ.. ఈసారి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్తో!
‘సామజవరగమన’ చిత్రంతో సినీప్రియుల్ని కడుపుబ్బా నవ్వించింది శ్రీవిష్ణు - రెబా మోనిక జాన్ల జోడీ. ఇప్పుడీ జంట మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న ఈ సినిమాని హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కిస్తున్నారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
మేడమ్ సార్.. మేడమ్ అంతే
రావు రమేశ్ కథానాయకుడిగా... లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి జంటగా నటించారు. ఇంద్రజ, హర్షవర్ధన్ కీలక పాత్రలు పోషించారు. -
హారర్ మిస్టరీ కథతో
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 11వ చిత్రం ఖరారైంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాని కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కించనున్నారు. -
సయీ ప్రేమకథ ఆలస్యం?
‘మేజర్’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్. ‘దబాంగ్ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్ దేవగణ్ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. -
‘యానిమల్’ అందుకే హిట్ అయింది: విద్యా బాలన్
‘యానిమల్’పై ఎన్ని విమర్శలు వచ్చినా అది సూపర్ హిట్ అయిందని విద్యా బాలన్ అన్నారు. -
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
కాబోయే భర్తకు అదితి స్పెషల్ విషెస్.. సమంత ‘హ్యాపీ’.. డాక్టర్గా ఆషికా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
సినీనటుడు రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడి దుర్మరణం
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?