Rana: మనీలాండరింగ్‌ కేసులో ముగిసిన రానా విచారణ

మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రానాను ఏడు గంటల పాటు విచారించింది.

Updated : 08 Sep 2021 19:13 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోన్న మాదకద్రవ్యాల కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. బుధవారం నటుడు రానాను ఈడీ అధికారులు విచారించారు. దాదాపు 7గంటలకు ఈ విచారణ కొనసాగింది. ప్రధాన నిందితుడు కెల్విన్‌తో లావాదేవీల గురించి రానాను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు కెల్విన్‌ఎవరో తెలియదని రానా చెప్పినట్లు సమాచారం. అయితే, మనీ లాండరింగ్‌ కోణంలో రానా బ్యాంకు ఖాతాలను కూడా అధికారులు పరిశీలించి, అనుమానాస్పద లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎఫ్‌ క్లబ్ విషయమై రానాను పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో పాటు సినీ ప్రముఖులు పూరీ, ఛార్మి, రకుల్‌, నందులను విచారించిన అధికారులు వారి వద్ద నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని