Major: ‘మేజర్‌’ యాక్షన్‌ షురూ

అడివి శేష్‌ కథానాయకుడిగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో  వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌  జీవితాధారంగా రూపొందుతోంది

Updated : 24 Oct 2021 09:40 IST

అడివి శేష్‌ కథానాయకుడిగా శశి కిరణ్‌ తిక్కా తెరకెక్కిస్తున్న చిత్రం ‘మేజర్‌’. ముంబయి 26/11 ఉగ్రదాడుల్లో  వీరమరణం పొందిన ఎన్‌ఎస్‌జీ కమాండో మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌  జీవితాధారంగా రూపొందుతోంది. దీన్ని మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సహకారంతో సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ముగింపు   దశకు చేరుకున్న ఈ సినిమా.. శనివారం నుంచి ఆఖరి షెడ్యూల్‌ను ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ సందర్భంగా అడివి శేష్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘‘మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌గా నా ప్రయాణం దాదాపు పూర్తయింది. ఈ షెడ్యూల్‌ తర్వాత.. నేను అతని ఆరాధకుడిగా తిరిగి వెళ్తాను’’ అన్నారు. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. శోభితా, సయీ మంజ్రేకర్‌ కథానాయికలు. ప్రకాశ్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీచరణ్‌ పాకాల స్వరాలందిస్తున్నారు. వంశి పచ్చిపులుసు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని