Arjuna Phalguna: గోదారోళ్లే సందమామా

శ్రీవిష్ణు కథానాయకుడిగా తెర కెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ నాయిక.  తేజ మర్ని   దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి,  అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘పచ్చని వూళ్లే

Updated : 14 Nov 2021 08:26 IST

శ్రీవిష్ణు కథానాయకుడిగా తెర కెక్కుతున్న చిత్రం ‘అర్జున ఫల్గుణ’. అమృతా అయ్యర్‌ నాయిక.  తేజ మర్ని   దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్‌రెడ్డి,  అన్వేష్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘‘పచ్చని వూళ్లే సందమామా... యాడ సూడు  నీళ్లే సందమామా.. బంగారు మట్టే... సిరి పండెనిట్టా...’’ అంటూ సాగే పాటని శనివారం విడుదల చేశారు. గోదావరి జిల్లాల పల్లె వాతావరణానికి, అక్కడి మనస్తత్వాలకి అద్దం పడుతూ సాహిత్యం అందించారు గీత రచయిత చైతన్యప్రసాద్‌. అమల చేబోలు, అరవింద్‌ ఆలపించారు. ప్రియదర్శన్‌ బాలసుబ్రహ్మణ్యన్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నరేష్‌, శివాజీరాజా, సుబ్బరాజు, దేవీప్రసాద్‌, రంగస్థలం మహేష్‌,     రాజ్‌కుమార్‌ చౌదరి, చైతన్య తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీష్‌ చీకటి, కళ: గంధి నడికుడికర్‌, మాటలు: సుధీర్‌వర్మ.పి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని