Gopichand: కొత్త చిత్రానికి శ్రీకారం

కథానాయకుడు గోపీచంద్‌, దర్శకుడు శ్రీవాస్‌ల కాంబినేషన్‌కు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ బాక్సాఫీస్‌ ముందు ఘన విజయాల్ని అందుకున్నాయి.

Updated : 25 Dec 2021 09:42 IST

థానాయకుడు గోపీచంద్‌, దర్శకుడు శ్రీవాస్‌ల కాంబినేషన్‌కు సినీప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. ఈ ఇద్దరి నుంచి వచ్చిన ‘లక్ష్యం’, ‘లౌక్యం’ బాక్సాఫీస్‌ ముందు ఘన విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడీ జోడీ ముచ్చటగా మూడో సారి జట్టు కట్టింది. గోపీచంద్‌ నటిస్తున్న 30వ చిత్రమిది. టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిభొట్ల, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌ కొట్టగా.. నిర్మాత టీజీ వెంకటేష్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రానికి భూపతి రాజా మంచి కథ అందించారు. కథకు తగ్గట్లుగా మంచి నటీనటులు దొరికారు. చిత్ర ఫలితం అంతే బాగా వస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు. ‘‘లక్ష్యం’, ‘లౌక్యం’ తర్వాత మళ్లీ ఇలా హ్యాట్రిక్‌ కోసం కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. మా గత రెండు సినిమాలను మించేలా ఈ మూవీ ఉండనుంది. ప్రేక్షకులు సరికొత్త గోపీచంద్‌ను చూస్తారు. సంక్రాంతి పండగ తర్వాత చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘వినోదాత్మకంగా సాగే చక్కటి కుటుంబ కథాంశంతో ఈ చిత్రం రూపొందనుంది. అలాగే మంచి సామాజిక సందేశం ఉంది. ఇది మంచి విజయాన్ని అందుకుంటుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్‌, ఛాయాగ్రహణం: వెట్రీ పళనిస్వామి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని