No Entry: ముగ్గురు హీరోలు... తొమ్మిదిమంది హీరోయిన్‌లు

సల్మాన్‌ఖాన్‌, అనిల్‌కపూర్‌, ఫర్దేన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నో ఎంట్రీ’ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల్ని అలరించింది. అనీష్‌ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘అనీష్‌

Updated : 27 Nov 2021 07:45 IST

సల్మాన్‌ఖాన్‌, అనిల్‌కపూర్‌, ఫర్దేన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నో ఎంట్రీ’ చిత్రం అప్పట్లో ప్రేక్షకుల్ని అలరించింది. అనీష్‌ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ‘‘అనీష్‌ స్క్రిప్టుని సిద్ధం చేశారు. ఈసారి ‘నో ఎంట్రీ’కి తొమ్మిందింతల వినోదం ఈ సీక్వెల్‌లో ఉండనుంది. సల్మాన్‌, అనిల్‌కపూర్‌, ఫర్దేన్‌ఖాన్‌...ఈ ముగ్గురూ త్రిపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో తొమ్మిదిమంది కథానాయికలు అలరించనున్నారు’’అని అనీష్‌ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సమాచారం. ‘నో ఎంట్రీ’లో నటించిన లారా దత్తా, ఈషా డియోల్‌, సెలీనా జైట్లీతో సంప్రదింపులు జరుపుతున్నారట. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని