MAA Elections: ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అమ్మకే తెలియాలి: హేమ

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో తమ ప్యానెల్‌ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలని నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆమె విజయవాడ...

Updated : 14 Oct 2021 12:05 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల్లో తమ ప్యానెల్‌ ఎలా ఓడిపోయిందో దుర్గమ్మకే తెలియాలని నటి హేమ అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించి.. కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది ఆమెకు తీర్థ ప్రసాదాలు అందించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ హేమ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఎంతగానో ఆరాధించే దుర్గమ్మ దీవెనలు పొందడం ఆనందంగా ఉందన్నారు. ‘‘నాకు దుర్గమ్మపై అపారమైన నమ్మకం ఉంది. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా అమ్మ దీవెనలు పొందడం నాకెంతో సంతోషంగా ఉంది. ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తున్నాయి’ అని హేమ తెలిపారు. చివరిగా ‘మా’ ఎన్నికలపై ఆమె స్పందించారు. ‘రాత్రికి గెలిచి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదు. దానికి గల కారణం అమ్మవారికైనా తెలుసో లేదో’ అని హేమ వ్యంగ్యంగా మాట్లాడారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ తరఫు నుంచి హేమ పోటీలో నిలబడిన విషయం తెలిసిందే. వీరి ప్యానెల్‌ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితం అంతటా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 10న ఆమె గెలిచినట్లు చెప్పి.. 11న ఆమె ఓడిపోయిందని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని