Year Ender 2021: అఖండ విజయాలు.. పుష్పగుచ్ఛాలు
ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? రారా? అనే సందేహాల మధ్య మొదలై... ‘అఖండ’మైన విజయాలతో పరిశ్రమకు ‘పుష్ప’గుచ్ఛాలు ఇచ్చి ముగుస్తోంది 2021 సినిమా సంవత్సరం. ఎప్పట్లాగే కొన్ని
ఈ ఏడాది 228 పైనే చిత్రాలు విడుదల
దేశ చిత్ర పరిశ్రమకే ఊపు
ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? రారా? అనే సందేహాల మధ్య మొదలై... ‘అఖండ’మైన విజయాలతో పరిశ్రమకు ‘పుష్ప’గుచ్ఛాలు ఇచ్చి ముగుస్తోంది 2021 సినిమా సంవత్సరం. ఎప్పట్లాగే కొన్ని విజయాలు సొంతమయ్యాయి. ఎక్కువ పరాజయాలూ వెంటాడాయి. వీటిన్నిటికంటే కరోనా భయాల మధ్య ఈ ఏడాది చిత్రసీమ చేసిన ప్రయాణం.. ప్రేక్షకుల సినీ ఉత్సాహం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరోనాతో తలెత్తిన ఈ సంక్షోభ సమయంలోనూ... ప్రపంచ సినిమా మొత్తం తీవ్ర ఒడుదొడుకులకి లోనవుతూ ఆచితూచి అడుగేలేస్తున్న ఈ దశలోనూ తెలుగు సినిమా హౌస్ఫుల్ బోర్డ్తో థియేటర్లని కళకళలాడించింది. రూ.కోట్లు కురిపించింది. కొత్త ముప్పు రాకపోతే వచ్చే ఏడాదీ బాక్సాఫీసు మనదే అనేంత నమ్మకం తెలుగు చిత్రసీమలో కనిపిస్తోంది.
తెలుగు ప్రేక్షకుల ఉత్సాహం చూసి తెలుగు చిత్రసీమ తగ్గేదే లేదన్నట్టుగా వరుసబెట్టి సినిమాల్ని విడుదల చేసింది. గతేడాది వాయిదా పడినవన్నీ పోటాపోటీగా విడుదల తేదీల్ని ఖరారు చేశాయి. రెండో దశ కరోనాతో కొన్ని నెలలపాటు థియేటర్లు మూతపడినా...ఆ తర్వాత కొన్నాళ్లు యాభై శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు కొనసాగినా రికార్డు స్థాయిలో సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. దేశంలోనే ఎక్కువ సినిమాల్ని థియేటర్లలో విడుదల చేసిన చిత్రసీమగా టాలీవుడ్ కీర్తిని గడించింది. దాదాపు 183 తెలుగు సినిమాలు విడుదల కాగా, 45కిపైగా అనువాద చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఓటీటీలోనూ సినిమాలు, వెబ్సిరీస్లు, షోలతో హోరెత్తించారు మన తారలు.
సంక్రాంతికి కళకళ
తెలుగులో ఒక్క బ్లాక్బస్టర్ వచ్చిందంటే చాలు... దాని మొత్తం వసూళ్లకి మించి పెట్టుబడి పెట్టేంతగా ధైర్యం చేస్తుంటారు నిర్మాతలు. ఒక మంచి విజయం వచ్చిందంటే ఆ సినిమా స్ఫూర్తితో వంద సినిమాలు షురూ అవుతుంటాయి. పెట్టుబడి తిరిగొచ్చినా చాలు... మరో ప్రయత్నం చేద్దాం అంటూ మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమ దూకుడు అలా ఉంటుంది. గతేడాది ‘సోలో బ్రతుకే సో బెటర్’ విడుదల కావడం... ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టడంతో కొండంత ధైర్యాన్ని కూడగట్టుకుంది చిత్రసీమ. ఆ వెంటనే సంక్రాంతి సినిమాలు పోటాపోటీగా విడుదలయ్యాయి. తెలుగు ప్రేక్షకుల సినిమా అభిరుచి చూసి ఇతర పరిశ్రమలన్నీ అవాక్కయ్యాయి. కరోనా ఉద్ధృతి కొనసాగుతున్నా లెక్క చేయకుండా మాస్క్లు ధరించి థియేటర్లకి వచ్చారు ప్రేక్షకులు. అందుకే సంక్రాంతికి విడుదలైన సినిమాలు ప్రేక్షకులతో కళకళలాడాయి. అది చాలు కదా చిత్రసీమలో ఉత్సాహం పెంచడానికి. అక్కడ్నుంచి వరుసగా విడుదలయ్యాయి. తొలి నెలలోనే 21 స్ట్రెయిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. రవితేజ కథానాయకుడిగా నటించిన ‘క్రాక్’ ఘన విజయం సాధించింది. ‘రెడ్’ పర్వాలేదనిపించింది. యాంకర్ ప్రదీప్ కథానాయకుడిగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ లాభాల్ని సొంతం చేసుకుంది. ‘అల్లుడు అదుర్స్’, ‘బంగారు బుల్లోడు’, ‘డర్టీ హరి’ తదితరాలు ఇదే నెలలోనే ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
* రెండో నెలలో ‘ఉప్పెన’ బాక్సాఫీసుని వసూళ్లతో ముంచెత్తింది. ‘జాంబీరెడ్డి’, ‘నాంది’ చిత్రాలు విజయాల్ని సొంతం చేసుకున్నాయి. ‘కపటధారి’, ‘చెక్’ తదితర చిత్రాలు నిరుత్సాహపరిచాయి.
* మూడో నెలలో ‘ఎ1 ఎక్స్ప్రెస్’, ‘శ్రీకారం’, ‘గాలిసంపత్’, ‘జాతిరత్నాలు’, ‘చావు కబురు చల్లగా’, ‘మోసగాళ్లు’, ‘శశి’, ‘రంగ్దే’, ‘అరణ్య’, ‘తెల్లవారితే గురువారం’ తదితర చిత్రాలొచ్చాయి. వీటిలో ‘జాతిరత్నాలు’ ఘన విజయాన్ని సొంతం చేసుకోగా, మిగిలినవి ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయాయి.
* భారీ అంచనాలతో ఏప్రిల్ మాసం మొదలైంది. నాగార్జున ‘వైల్డ్డాగ్’, పవన్కల్యాణ్ ‘వకీల్సాబ్’ చిత్రాలు ఇదే నెలలోనే విడుదలయ్యాయి మరీ! ‘వకీల్సాబ్’గా పవన్కల్యాణ్ చేసిన సందడి అభిమానులకి ప్రేక్షకులకు బాగా నచ్చింది. నాగార్జున ‘వైల్డ్డాగ్’ పర్వాలేదనిపించుకున్నా బాక్సాఫీసుపై ప్రభావం చూపించలేకపోయింది. తొలి నాలుగు నెలల కాలంలో 79 సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాక రెండో దశ కరోనాతో మరోసారి చిత్రసీమ స్తంభించిపోయింది.
విరామం తర్వాత...
రెండో లాక్డౌన్ తర్వాత జులై చివర్లో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’ చిత్రాలతో మళ్లీ థియేటర్లు తెరుచుకున్నాయి. ‘తిమ్మరుసు’ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆగస్టులో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’, ‘పాగల్’, ‘రాజ రాజ చోర’, ‘బజార్రౌడీ’, ‘ఇచట వాహనములు నిలుపరాదు’, ‘శ్రీదేవి సోడా సెంటర్’ తదితర చిత్రాలొచ్చాయి. సెప్టెంబర్లో ‘డియర్ మేఘ’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘సీటీమార్’, ‘గల్లీరౌడీ’, ‘లవ్స్టోరి’ చిత్రాలు రాగా... వీటిలో ‘లవ్స్టోరి’ ప్రేక్షకులకు నచ్చింది. ‘సీటీమార్’ మాస్ ప్రేక్షకుల్ని మెప్పించింది.
చివరి మూడు నెలల్లో...
ఏడాది చివరి మూడు నెలల కాలంలో కీలకమైన దసరా, దీపావళి సీజన్లు ఉంటాయి. ఆ సీజన్లని లక్ష్యంగా చేసుకుని సినిమాలు విరివిగా ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. ఈసారీ అంతే. ‘రిపబ్లిక్’, ‘కొండపొలం’, ‘మహా సముద్రం’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’, ‘పెళ్లి సందడి’, ‘రొమాంటిక్’, ‘వరుడు కావలెను’ చిత్రాలు అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ విజయాన్ని అందుకుంది.
* నవంబర్లో ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఎనిమి’, ‘కురుప్’, ‘పుష్పకవిమానం’, ‘తెలంగాణ దేవుడు’, ‘రాజా విక్రమార్క’, ‘అనుభవించు రాజా’, ‘కాలీఫ్లవర్’ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. నవంబర్ ఆఖరు నుంచి క్రిస్మస్ వరకు అన్సీజన్గా భావిస్తుంటుంది చిత్రసీమ. సంక్రాంతికి రానున్న పెద్ద సినిమాలవైపు ప్రేక్షకుల దృష్టి మళ్లుతుంటుంది. కానీ పండగకి పెద్ద సినిమాలు రావడం కాదు, పెద్ద సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండగ అని నిరూపించాయి ఈ ఏడాది ఆఖరి నెలలో వచ్చిన ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలు. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘అఖండ’ బాక్సాఫీసు దగ్గర సత్తా చాటింది. చాలా రోజుల తర్వాత మాస్ ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్కి రప్పించింది. అల్లు అర్జున్ ‘పుష్ప’ విజయ పరంపరని కొనసాగించింది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా విజయవంతంగా ప్రదర్శితమవుతూ తెలుగు సినిమా సత్తాని దేశవ్యాప్తంగా మరోసారి చాటి చెప్పింది. నాని నటించిన ‘శ్యామ్ సింగరాయ్’దే ఈసారి క్రిస్మస్. ఈ చిత్రానికి మంచి వసూళ్లు వచ్చాయి. ఈ నెలలో వచ్చిన ‘స్కైలాబ్’, ‘గమనం’ మంచి ప్రయత్నాలుగా నిలిచాయి. శ్రీవిష్ణు ‘అర్జున ఫల్గుణ’, రామ్గోపాల్ వర్మ చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’తో ఏడాది ముగుస్తోంది.
* తెలుగులో తెరకెక్కిన చిత్రాలే కాదు, అనువాద చిత్రాలూ పెద్ద ఎత్తునే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటిలో సంక్రాంతికి విడుదలైన విజయ్ ‘మాస్టర్’తోపాటు శివకార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్’, కార్తీ ‘సుల్తాన్’, కంగనరనౌత్ ‘తలైవి’, ‘సూపర్మేన్ నో వే టు హోమ్’ చిత్రాలు మంచి వసూళ్లని సొంతం చేసుకున్నాయి. రజనీకాంత్ ‘పెద్దన్న’తోపాటు సిద్ధార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ది’, విజయ్ ఆంటోనీ ‘విజయ రాఘవన్’ తదితర కీలక చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
ఓటీటీలో సందడే సందడి
థియేటర్లలోనే కాకుండా... ఓటీటీలోనూ పలు కీలకమైన సినిమాలు విడుదలయ్యాయి. వెంకటేష్ కథానాయకుడిగా నటించిన ‘నారప్ప’, ‘దృశ్యం2’ చిత్రాలు ఓటీటీ వేదికల్లోనే ఆదరణ పొందాయి. నితిన్ ‘మాస్ట్రో’, నాని ‘టక్ జగదీష్’, సూర్య ‘జై భీమ్’, ఆర్య ‘సార్పట్ట’, తేజ సజ్జా - శివాని రాజశేఖర్ల ‘అద్భుతం’తోపాటు ‘మెయిల్’, ‘సినిమాబండి’, ‘ఏక్ మినీ కథ’, ‘నెట్’, ‘వివాహ భోజనంబు’, ‘ఆకాశవాణి’ తదితర చిత్రాలు ఓటీటీలో అలరించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాటల హంగామా..
ఈ వేసవిలో అగ్ర తారల సినిమాల జోరు కనిపించలేదు. మే నుంచైనా హడావుడి మొదలవుతుందేమో అనుకుంటే, ఇంకాస్త ఆలస్యం అనే సంకేతాలు వస్తున్నాయి. ‘పుష్ప2’ మినహా మరే సినిమా విడుదల తేదీని ఖరారు చేయలేదు. -
అజిత్ సరసన శ్రీలీల?
అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్ హీరో అజిత్తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. -
ప్రభాస్తో కియారా?
‘సలార్ 2’ని పట్టాలెక్కించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్లో లేదా జులైలో ప్రభాస్ రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. ఈ దశలోనే ఈ సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. -
ముంబయిలో కుబేర
ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. రష్మిక కథానాయిక. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. అమిగోస్ క్రియేషన్స్ సంస్థతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు నిర్మిస్తున్నారు. -
ఇళయరాజా కేసులో ట్విస్ట్
పాటలకు గీత రచయిత కూడా హక్కు కోరితే ఏమవుతుందని సంగీత దర్శకుడు ఇళయరాజా వ్యవహారంలో మద్రాసు హైకోర్టు ప్రశ్నించింది. కాపీరైట్ గడవు ముగిసినా, తన పాటలను ఇంకా వాడుకుంటున్నారంటూ ఎకో, ఏఐజీ మ్యూజిక్ కంపెనీలపై సంగీత దర్శకుడు ఇళయరాజా దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. -
హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్’
కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘చి90×(’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్’ చేరింది. -
పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం
‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. -
ముగిసిన కీర్తి తొలి హిందీ చిత్రం
ఆచితూచి కథల్ని ఎంచుకుంటూ.. అన్ని భాషా చిత్రాల్లోని సినీప్రియుల్ని మెప్పిస్తోంది కథానాయిక కీర్తి సురేశ్. దక్షిణాదిలో ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న ఈ భామ.. ‘బేబీ జాన్’తో బాలీవుడ్లోనూ అడుగు పెట్టింది. -
తారల మెరుపులు షురూ
అగ్ర కథానాయకుడు ఆమిర్ఖాన్ ‘లాల్సింగ్ చద్ధా’ పరాజయం తర్వాత అభిమానులు, పరిశ్రమవర్గాల చూపంతా ‘సితారే జమీన్ పర్’పైనే ఉంది. దీన్ని ఆర్.ఎస్.ప్రసన్న తెరకెక్కిస్తున్నారు. -
ఇన్నాళ్లకు కల నెరవేరింది
‘విలన్ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్ బజార్’తో నా కల నెరవేరింది. -
స్పై యాక్షన్ కామెడీతో...
గతేడాది ‘డ్రీమ్గర్ల్ 2’తో మంచి విజయాన్ని అందుకున్న బాలీవుడ్ కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా.. ఇప్పుడో సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఓ స్పై కామెడీ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
తాను నటించిన ‘హీరామండీ’ వెబ్సిరీస్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సోనాక్షి ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా